పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా మధుసూదన్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా కడప ఆర్డీఓ మధుసూదన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కడపలో పోలింగ్‌ పటిష్ఠంగా నిర్వహించేందుకు ఆయన చర్యలు తీసుకున్నారు. కడప ఆర్డీఓ మధుసూదన్ సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి ఓఎస్డీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్‌ను కలిసి మధుసూదన్ పుష్పగుచ్ఛం అందజేశారు.