తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం (జులై 7) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 24 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శనివారం శ్రీవారిని మొత్తం 77 వేల 995 మంది దర్శించుకున్నారు.

వారిలో 30 వేల 250 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 72 లక్షల రూపాయలు వచ్చింది.