నేపాల్ విద్యార్ధినిపై సామూహిక అత్యాచారం
posted on Oct 16, 2012 2:59PM

బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియాలో ఓ విద్యార్దినిపై సామూహిక అత్యాచారం జరిగింది. 800 ఎకరాల జ్ఞానభారతి క్యాంపస్ లో ఈ దారుణం జరిగింది. శనివారం రాత్రి తన ప్రియుడితో కలిసి కారులో క్యాంపస్ నుంచి వెళ్తున్న అమ్మాయిపై ఎనిమిదిమంది వ్యక్తులు దాడి చేశారు. ప్రియుణ్ణి తరిమికొట్టి ప్రియురాలిని దట్టమైన అడవిలోకి లాక్కెళ్లి అత్యాచారం జరిపారు. క్యాంపస్ లో బీట్ కానిస్టేబుల్ కి సమాచారం అందించిన ఆమె ప్రియుడు తమని దుండగులు అడ్డగించిన ప్రదేశానికెళ్లి చూస్తే విద్యార్ధిని కనిపించలేదు. తెల్లవారుజామున దుండగులు ఆమెని ఓ హాస్టల్ సమీపంలో పడేసి వెళ్లిపోయారు. సెల్ ఫోన్ లో ప్రియుడికి ఆమె సమాచారం అందించిన తర్వాత అక్కడికి చేరుకుని ఆగమేఘాలమీద ఆసుపత్రికి తరలించి భాధితురాలికి వైద్య పరీక్షలు చేయించారు.