విజయవాడలో విరిగిపడ్డ కొండచరియలు!

విజయవాడలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. స్థానిక క్రీస్తురాజపురంలో కొండచరియలు విరిగిపడి నలుగురు మరణించారు. ఇద్దరికి గాయాలయ్యాయి. నాలుగు ఇళ్ళు ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రొక్లెయినర్ల సహకారంతో కొండ రాళ్లను తొలగిస్తున్నారు. సహాయక చర్యలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సీపీ రాజశేఖర్ బాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కొండ చరియలు విరిగిపడిన సమయంలో ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదని అనుకున్నారు. అయితే ఆ తర్వాత శిథిలాల కింద కొంతమంది వున్నారని గుర్తించారు. వారిలో ఇద్దరు అప్పటికే చనిపోయారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.  ప్రభుత్వం పరంగా అవసరమైన రక్షణ చర్యలు తీసుకుంటామని స్థానికులకు అధికారులు హామీ ఇచ్చారు. చనిపోయినవారి కుటుంబాలకు ప్రభుత్వం పరంగా సాయం అందిస్తామని అధికారులు, నాయకులు ప్రకటించారు.