కుల్వంత్ హాల్‌లోనే సత్య సాయి ఖననం

పుట్టపర్తి: సత్య సాయిబాబా పార్ధివ దేహాన్ని కుల్వంత్ హాల్‌లోనే ఖననం చేయాలని ట్రస్టు సభ్యులు ఓ నిర్ణయానికి వచ్చారు. సత్య సాయి కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ట్రస్టు సభ్యులు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సత్య సాయి కుటుంబ సభ్యులతో ట్రస్టు సభ్యులు పలు విడతలు చర్చలు జరిపారు. భక్తులకు సత్య సాయి కుల్వంత్ హాల్‌లోనే దర్శనమిచ్చేవారు. బాబా నివసించే యజర్ మందిర్‌లో పార్ధివ దేహాన్ని ఖననం చేయాలని తొలుత అనుకున్నారు. అయితే, యజర్ మందిర్‌లో ఖననం చేస్తే దర్శనానికి ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్దేశంతో కుల్వంత్ హాల్లోనే ఖననం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu