కన్నడనటి హేమశ్రీ కేసులో వీడిన మిస్టరీ

Kannda actress hemasri, hemasri death, hemasri death, hemasri died, hemasri death mysteriously

 

కన్నడనటి హేమశ్రీ మరణం మిస్టరీ విడిపోయింది. అనంతపురంలో కాంగ్రెస్ నేత మురళీ ఫాంహౌస్ లో ఆమెపై అత్యాచారం జరిపి హత్యచేశారని విచారణలో తేలింది. హేమశ్రీకి ఎక్కువ మోతాదులో మత్తుమందిచ్చి ఆమెపై అత్యాచారం చేయడంవల్ల చనిపోయిందని పోస్ట్ మార్టం నివేదిక తేల్చింది. స్పృహకోల్పోయిన మూడుగంటలతర్వాత ఆమెని ఆసుపత్రికి తరలించారని, అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్థారించారు. ఆత్యాచారానికీ, హత్యకీ పాల్పడ్డ నిందితులు పరారీలో ఉన్నారు. హేమశ్రీ భర్త సుధీంద్రతో కాంగ్రెస్ నేత మురళికి వ్యాపార లావాదేవీలున్నాయ్. చాలాకాలంగా హేమశ్రీపై కన్నేసిన మురళి ఓ పథకం ప్రకారం అత్యాచారం జరిపి, హత్యచేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. కిందటేడాదే సుధీంద్రతో హేమశ్రీకి పెళ్లయ్యింది. అంతకుముందే అతనికి పెళ్లైపోయినట్టు తెలియడంతో హేమశ్రీ గొడవకు దిగడంతో బంధువులు రాజీ కుదిర్చారు. అప్పట్నుంచీ ఇద్దరూ అనంతపురంలో కాపురం చేస్తున్నారు. హేమశ్రీని ఆమె భర్త సుధీంద్రే హతమార్చాడన్న వదంతులు బలంగా ప్రచారమయ్యాయి. భార్యని చావుబతుకుల్లో ఆసుపత్రిలో చేర్చిన సుధీంద్ర పోలీసులకు కీలకమైన సమాచారం అందించడంతో మిస్టరీ విడిపోయింది. పరారీలో ఉన్న నిందితులకోసం పోలీసులు పెద్దఎత్తున గాలిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu