కారెక్కిన కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి..!!
posted on Jul 3, 2018 11:53AM
జగిత్యాల జిల్లాలో కార్యకర్తల సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్తో కలిసి నిజామాబాద్ ఎంపీ కవిత హాజరయ్యారు.. ఈ సందర్బంగా మాట్లాడిన కవిత, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మెచ్చి ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున టీఆర్ఎ్సలో చేరుతున్నారని.. ఈ పరిణామంతో ప్రతిపక్ష నేతల గుండెల్లో గుబులు మొదలైందని అన్నారు.. కవిత ఈ వ్యాఖ్యలు చేసిన రోజే ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.. జగిత్యాలలో సోమవారం మంత్రి ఈటల రాజేందర్తో కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి నిజామాబాద్ ఎంపీ కవిత కారు ఎక్కారు.. దీంతో జీవన్ రెడ్డి తెరాస నేతల కారే ఎక్కారా? లేక త్వరలో కాంగ్రెస్ కి టాటా చెప్పి, తెరాస కారు ఎక్కుతారా? అంటూ చర్చలు మొదలయ్యాయి.. చూద్దాం ఏం జరుగుతుందో.