జైల్లో రేపిస్టు సుధాకర్‌.. పరామర్శకు వెళ్లనున్న జగన్?

గత మూడేళ్ళుగా మైనర్ బాలికను వేధిస్తున్న కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్‌ని పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కి పంపించారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి రిమాండ్‌లో వున్న రేపిస్టు సుధాకర్‌ని పరామర్శించాల్సిన అవసరం వుంది. హత్యాయత్నం కేసులో జైల్లో వున్న తన పార్టీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పాతిక  లక్షల రూపాయల ఖర్చు పెట్టించి పరామర్శించిన జగన్, ఇప్పుడు రేప్ కేసులో అరెస్టు అయిన సుధాకర్‌ని కూడా పరామర్శించాలి. పిన్నెల్లిని పరామర్శించి బయటకి వచ్చిన తర్వాత జగన్, పిన్నెల్లి ఈవీఎంలు పగలగొట్టడాన్ని సిగ్గులేకుండా సమర్థించారు. అలాగే రేపిస్టు సుధాకర్ని పరామర్శించి, జైల్లోంచి బయటకి వచ్చిన తర్వాత సుధాకర్ చేసిన రేప్‌ని కూడా సమర్థిస్తూ మాట్లాడాలి. ‘‘పాపం సుధాకర్‌కి రేప్ చేయక తప్పని పరిస్థితి వుంది కాబట్టి రేప్ చేశాడు... రేప్ చేయాల్సిన అవసరం లేకపోతే ఎందుకు రేప్ చేస్తాడు?’’ అని సిగ్గులేకుండా మాట్లాడే శక్తి జగన్‌కే వుంది కాబట్టి... జగన్ అలా మాట్లాడాలి. చంద్రబాబుని తిట్టడానికి జగన్ ఏ సాకు దొరుకుతుందా వెతుక్కుంటున్నాడు కదా... ఈ రేపిస్టు దగ్గరకి వెళ్ళినప్పుడు కూడా, ‘‘ఇదంతా వైసీపీ వాళ్ళమీద చంద్రబాబు కుట్ర’’ అని రంకెలు వేయాలి.. ఇదంతా విని జనం జగన్ ముఖం మీద మరోసారి ఊయాలి!