హైదరాబాద్‌లో హై అలర్ట్

 

ఉగ్రవాద దాడులు పొంచి వున్నాయన్న నిఘా వర్గాల సమాచారంతో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌తో సహా దేశంలోని ప్రధాన నగరాలలో హై అలర్ట్ ప్రకటించింది. ఇటీవల ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో, పశ్చిమాఫ్రికా దేశం మాలి రాజధాని బొమాకోలో ఉగ్రవాద దాడులు జరిగిన నేపథ్యంలో మన దేశానికి కూడా ఉగ్రవాదుల నుంచి దాడుల ప్రమాదం వుందని నిఘా వర్గాలు సమాచారం అందించాయి. దాంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా వుండాలని కేంద్రం సూచించింది. ముఖ్యంగా ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, బెంగుళూరు, కోల్‌కతా నగరాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్రం ఆదేశించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu