టీడీపీ నుండి సుధారాణి సస్పెండ్


తెలంగాణ టీడీపీ ఎంపీ గుండు సుధారాణి టీడీపీ ని వీడి టీఆర్ఎస్ పార్టీలోకి మారనున్నట్టు చాలా రోజుల నుండి వార్తలు వింటూనే ఉన్నాం. దీనికి తోడు ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడంతో ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ విషయంపై మాత్రం సుధారాణి మాట్లాడుతూ తాను కేవలం తెలంగాణ అభివృద్దికి పోరాడుతున్న కేసీఆర్ కు అభినందనలు చెప్పటానికే కలిశానని.. ఒక తెలంగాణ బిడ్డగా తాను కూడా తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలని చూస్తున్నానని.. అంతేకాని కేసీఆర్ ను కలవడం వెనుక ఆంతర్యం ఏం లేదని చెప్పారు. అయితే ఇక్కడి వరకూ బానే ఉన్నా ఇప్పుడు సుధారాణికి ఒక షాక్ తగిలింది. టీడీపీ నుండి ఎంపీ సుధారాణికి సస్పెన్షన్ వేటు విధించారు. దీనిలో భాగంగానే టీడీపీ నుండి సుధారాణిని సస్పెండ్ చేస్తూ టీడీపీ కేంద్రం క్రమశిక్షణా కమిటీ నిర్ణయం తీసుకుంది. మరి ఇప్పుడు సుధారాణి ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.