గాలి జీవితమంతా స్వర్ణమయమే
posted on May 30, 2011 10:58AM
బెంగళూ
రు: బిజెపి నాయకుడు, కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో అంతా బంగారమే. ఆయన కూర్చునే కుర్చీ కూడా బంగారమే. దాని ఖరీదు 2.2 కోట్ల రూపాయలు. బంగారంతో తయారు చేసిన విగ్రహాలకు పూజలు చేస్తారు. వాటి విలువ రూ. 2.28 కోట్లు. రూ. 13.15 లక్షల విలువ చేసే బెల్టు ధరిస్తారు. గాలి జనార్దన్ రెడ్డి జీవితమంతా స్వర్ణమయమే. గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన ఈ వివరాలతో ఆ ఆంగ్లదినపత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది. బంగారు పల్లెంలోనే తింటారు. గిన్నెలు, చెంచా, ఫోర్కు, కత్తి - అన్నీ బంగారానివే. వీటి విలువ రూ. 20.87 లక్షలు ఉంటాయని సమాచారం. ఆ వివరాలన్నీ కర్ణాటక లోకాయుక్తకు సమర్పించినవేనని ఆ పత్రిక రాసింది. 2010 మార్చి 31వ తేదీ వరకు తనకు గల ఆస్తుల వివరాలను గాలి జనార్దన్ రెడ్డి 2010 జూన్ 25వ తేదీన లోకాయుక్తకు సమర్పించారు. గాలి జనార్దన్ రెడ్డికి గల ఆభరణాల జాబితా మూడు పేజీల నిండా ఉంది. వాటి విలువ కోట్లాది రూపాయలు ఉంటుంది. ఎయిర్ కండీషనర్స్, టీవీ సెట్లు, ఫర్నీచర్ - ఇంటి వస్తువుల విలువ లక్షలాది రూపాయలు ఉంటుంది. వ్యవసాయ భూములు, భవనాలను, వారసత్వ ఆస్తులను మినహాయిస్తేనే గాలి జనార్దన్ రెడ్డి ఆస్తులు 153.49 కోట్ల రూపాయల విలువ చేస్తుంది. ఆయన నెజీతం రూ. 31.54 కోట్లు కాగా, వాణిజ్య ఆదాయం రూ. 18.30 కోట్లు.