అల్లు వారి వేడుకలో జగన్ మావయ్య...

అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'బడ్డీ'. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని ఏఏఏ సినిమాస్ లో మంగళవారం సాయంత్రం జరిగింది. అయితే ఈ వేడుకలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

'బడ్డీ' చిత్రంలో 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ కూడా నటించాడు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఆయన కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడదామని అజ్మల్ మైక్ పట్టుకోగానే.. అక్కడున్న ఆడియన్స్ ఒక్కసారిగా ''జగన్ మావయ్య.. జగన్ మావయ్య" అంటూ కేకలు వేశారు. మొదట ఆడియన్స్ ఏమన్నారో అర్థంగాక మళ్ళీ అడిగిన అజ్మల్.. ఆ తరువాత ఏమన్నారో అర్థమై "జగనన్ననా.. ప్రమాణం చేస్తున్నాను" అంటూ వైఎస్ జగన్ ని ఇమిటేట్ చేసి గట్టిగా నవ్వేశాడు.

కాగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు', 'వ్యూహం' వంటి సినిమాల్లో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించిన విషయం తెలిసిందే. అందుకే అజ్మల్ ని చూడగానే ఆడియన్స్ "జగన్ మావయ్య" అని అరిచారు.