తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  బుధవారం (ఏప్రిల్ 24) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా డైరెక్ట్ క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం (ఏప్రిల్ 23) శ్రీవారిని మొత్తం 60వేల 371 మంది భక్తులు దర్శించుకున్నారు.

వారిలో 20 వేల 301 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 9 లక్షల రూపాయలు వచ్చింది.