దావూద్ ఇబ్రహీం ఆస్తులు సీజ్..

 

మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తులను దుబాయ్ లో సీజ్ చేశారు. దావూద్ కు చెందిన హోటళ్లు, ఇతర ఆస్తులను దుబాయ్ సహా సౌదీలో యూఏఈ ప్రభుత్వం జప్తు చేసింది. ఈ జప్తు చేసిన ఆస్తుల విలువ రూ.15 వేల కోట్ల దాకా ఉంటుందని అంచనా. దావూద్ పై భారత్ ఇచ్చిన సాక్ష్యాలు ఆధారంగా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. దావూద్‌కు యూఏఈలో పలు హోటళ్లు, ప్రముఖ కంపెనీల్లో షేర్లు ఉన్నాయన్న నేపథ్యంలో.. భారత ప్రభుత్వం నుంచి అందుకున్న అత్యంత గోప్యమైన జాబితా ఆధారంగా యూఏఈ సర్కారు దావూద్‌ ఇబ్రహీం ఆస్తులపై విచారణ ప్రారంభించి, చర్యలు తీసుకుంది. అంతేకాదు గత ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్‌ యూఏఈ పర్యటనకు వెళ్లినప్పుడు ఈ జాబితా సమర్పించి...డి కంపెనీ ఆస్తులు స్వాధీనం చేసుకోవాల్సిందిగా కోరినట్టు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu