తొలిసారి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా సిక్కు వ్యక్తి....

 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ ఉదయం ఖేహర్ తో ప్రమాణస్వీకారం చేయించారు. ఆగస్టు 27 వరకు అంటే దాదాపు 8 నెలల పాటు ఖేహర్ ఈ పదవిలో ఉంటారు. ఇదిలా ఉండగా సిక్కు వర్గానికి చెందిన ఖేహర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి. ఇంకా ఖేహర్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu