సూరత్‌లో కూలిన భవనం.. ఏడుకు చేరిన మృతులు

గుజరాత్‌లోని సూరత్‌లో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. సూరత్‌లోని పాల్ ప్రాంతంలో శనివారం ఆరంతస్తుల భవనం కూలింది. శిథిలాల్లో చిక్కుకున్న పలువురి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. 2016లో నిర్మించిన ఈ భవనం కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోయినట్లు పోలీసులు తెలిపారు. సమీపంలోని ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికులు ఈ భవనంలో నివసిస్తున్నారని పేర్కొన్నారు.