బెంచ్ పై నుంచున్న బీజేపీ ఎమ్మెల్యే.. వినూత్న నిరసన..
posted on Jun 10, 2016 5:08PM

సాధారణంగా అసెంబ్లీల్లో నిరసన తెలియజేయాలంటే.. సభ జరగకుండా అడ్డుకోవడమో.. లేక స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి నినాదాలు చేయడమో చూస్తుంటాం. కానీ ఢిల్లీ అసెంబ్లీలో మాత్రం ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఒక ఎమ్మెల్యే తన నిరసనను తెలియజేయడానకి ఏకంగా బెచ్ ఎక్కేశాడు. ఢిల్లీ శాసనసభలో విపక్ష నేతగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర గుప్తా ట్యాంకర్ల స్కాం గురించి తన నిరసనను వ్యక్తం చేసేందుకు అసెంబ్లీలో బెంచ్ ఎక్కారు. దీంతో విజేంద్ర గుప్తా చేసిన పనికి మిగతా ఎమ్మెల్యేలు అవాక్కయ్యారు. అయితే స్పీకర్ రామ్ నివాస్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ విధంగా నిరసన తెలిపిన వారిని చూడటం ఇదే మొదటిసారి అంటూ విజేంద్ర గుప్తా చేసిన పనికి మండిపడ్డారు. సభా సమయాన్ని వృథా చేస్తున్నారంటూ స్పీకర్ మందలించినప్పటికీ విజేంద్ర గుప్తా ఏమాత్రం తగ్గలేదు. ఆ సమయంలో సభలో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా ఉండటం గమనార్హం.