దత్తాత్రేయ కుమారుడి హఠాన్మరణం

 

కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఇంట ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఆయన ఒక్కగానొక్క కుమారుడు వైష్ణవ్‌ నిన్న రాత్రి గుండెపోటుతో మరణించారు. వైష్ణవ్‌ వయసు కేవలం 21 సంవత్సరాలు కావడం గమనార్హం. ప్రస్తుతం తను ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. నిన్న రాత్రి సుమారు 11 గంటలకు వైష్ణవ్‌ తీవ్ర అస్వస్థతను లోనైనట్లు చెబుతున్నారు. హుటాహుటిన కేర్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లనా లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ తను 12:30 నిమిషాలకు మృతి చెందినట్లు వైద్యులు తెలియచేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu