ఆంధ్రా ఎస్కోబార్ మిస్టర్ జగన్!

జగన్ ఢిల్లీ వెళ్ళి ఎంత మొత్తుకున్నా అరణ్య రోదనే అయిపోయింది. ఆయన గోలని నేషనల్ మీడియా ఎంతమాత్రం పట్టించుకోలేదు. అయితే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మీద శ్వేతపత్రం విడుదల  చేశారు. జగన్ రాక్షస పరిపాలనలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు యథేచ్ఛగా జరిగాయని చెప్పారు. జగన్ ఆంధ్రా ఎస్కోబార్ లాంటివాడు అన్నారు. అంతే, నేషనల్ మీడియా ఈ పాయింట్‌ని అంది పుచ్చుకుంది. జగన్‌ని అంతర్జాతీయ డ్రగ్స్ క్రిమినల్ పాబ్లో ఎస్కోబార్‌తో పోలుస్తూ కథనాలు ప్రసారం చేస్తోంది.  ఏ నేషనల్ ఛానల్‌లో చూసినా జగన్... ఎస్కోబార్.. ఇవే కథనాలు ప్రసారం అవుతున్నాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu