అక్బరుద్దీన్‌పై దాడి నిందితులకు బెయిలు

హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ పహిల్వాన్ తో పాటు మరో ఐదుగురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాడికి పాల్పడ్డ వారిలో 15 మందిని నిందితులుగా గుర్తించారు. వారిలో ఒకరు మరణించగా, 14మందికి రిమాండ్ విధించారు. నిందితుల్లో కొంతమందికి గతంలోనే బెయిల్ రాగా, ఆరుగురికి ఇప్పుడు లభించింది. బెయిల్ పొందినవారిలో ప్రధాన నిందితుడు మహ్మద్ బిన్, ఉమర్, హుస్సేన్, ఈసా, హుస్సేన్ బిన్ యాఫై, ఫైజల్, ఫైసల్ ఉన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu