ఆఫ్గాన్‌ లో మరో ఉగ్రదాడి..

 

ఆప్ఘనిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి తమ పంజా విసిరారు. ఇప్పటికే రాజధాని కాబుల్ లో జరిపిన దాడిని మరిచిపోకముందే మరో దాడికి పాల్పడి తమ పైశాచికాన్ని ప్రదర్శించారు. కాబూల్‌కు తూర్పున 120 కిలోమీటర్ల దూరంలోని జలాలాబాద్‌లోని విమానాశ్రయం బయట.. ఉదయం కారుబాంబును పేల్చారు. ఈ ఘటనలో ఒక సైనికుడు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకొనే కారుబాంబును పేల్చినట్లు నాన్‌ఘర్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ అట్టుల్లా ఖోగియాని తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu