గండిపేటలో కాల్పుల కలకలం..

 

హైదరాబాద్ నగరంలోని గండిపేటలో కాల్పుల కలకలం రేగింది. గండిపేటలోని పుప్పాలగూడ వద్ద నిన్న రాత్రి జరిగిన కాల్పుల వల్ల అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల ప్రకారం.. గోల్కొండ రిసార్ట్‌లో నిన్న రాత్రి ఓ ఫంక్ష‌న్ జ‌రిగింది. ఈ ఫంక్షన్ కు  గండిపేట సర్పంచ్ భర్త ప్రశాంత్ యాదవ్, న‌ల్గొండ జిల్లా కోదాడ‌కు చెందిన ప్ర‌భాక‌ర్ హాజ‌ర‌య్యారు. అయితే వీరిద్దరికి ఓ ఆస్తి వివాదంలో వాగ్వాదం జరుగగా.. ప్ర‌శాంత్‌ను బెదిరించేందుకు ప్ర‌భాక‌ర్ గాల్లోకి కాల్పులు జ‌రిపారు. అయితే కాల్పులు జ‌రిపిన స‌మ‌యంలో ప్ర‌భాక‌ర్ తాగి ఉన్నాడ‌ని పోలీసులు చెప్పారు. దీనిపై పోలీసులు మ‌రిన్ని వివ‌రాలు సేక‌రిస్తున్నామని తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu