గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు వాయిదా

రేపటినుంచి జరగాల్సిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కీ వివాదంపై మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని ఏపీపీఎస్సీ భావించడంతో మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 17 నుంచి 26వ తేదీ వరకు ఈ పరీక్షలను రీ షెడ్యూల్ చేశారు. సవరించిన కీ ని మరి కాసేపట్లో తమ వెబ్ సైట్ లో పెట్టనున్నట్టు ఏపీపీఎస్సీ వెల్లడించింది. మొత్తంగా 1201 మంది గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు ఎంపికయ్యారు. వీరు సెప్టెంబర్ 5 నుంచి మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.