శనివారం ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిది...
రంగులు మన జీవితాలపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. వారంలోని ఏడు రోజులూ గ్రహం ప్రకారం దుస్తులు ధరించడం వల్ల జీవితంలో ఆనందం, శాంతి కలుగుతాయని పండితులు చెబుతారు. కర్మ ఫలాలను ఇచ్చేవాడు, న్యాయ దేవుడుగా పరిగణించబడే శని దేవుడికి శనివారం చాలా ముఖ్యం. శని అనుగ్రహం వల్ల వ్యక్తి జీవితంలో విజయం, శ్రేయస్సు, స్థిరత్వాన్ని వస్తుంది. అయితే శని చెడు దృష్టి జీవితంలో పోరాటాలు, ఇబ్బందులను పెంచుతుంది. కాబట్టి శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి సరైన రంగు దుస్తులు ధరించడం, కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం మంచిది. శనివారం నాడు ఏ రంగు దుస్తులు ధరించాలో, ఈ రోజున ఎలాంటి పనులు చేయాలో తెలుసుకుంటే..
ఏ రంగు ధరించాలి..
శనివారం నాడు ముదురు రంగులు, గంభీరమైన వ్యక్తిత్వాన్ని చూపే రంగుల దుస్తులు ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా నలుపు, ముదురు నీలం, ముదురు గోధుమ, ఊదా రంగు దుస్తులు ధరించడం వల్ల శని నుండి సానుకూల శక్తి లభిస్తుంది. ఈ రంగులు శని దేవుడికి ప్రియమైనవి, ఆయన చల్లని చూపును బలపరుస్తాయి. శనివారం నాడు ఈ రంగుల దుస్తులను ధరించినప్పుడు, శని దేవుడి శక్తి జీవితంలో అడ్డంకులను తగ్గించి, పనిలో విజయాన్ని తెస్తుందని చెబుతారు.
ఏ రంగు ధరించకూడదు..
తెలుపు, గులాబీ, లేత నీలం లేదా లేత ఆకుపచ్చ వంటి లేత, ప్రకాశవంతమైన రంగులను ధరించకుండా ఉండాలి. ఈ రంగులు శని ప్రభావాన్ని బలహీనపరుస్తాయి. జీవితంలో ఇబ్బందులను తెస్తాయి.
శనిదేవుడి ఆశీర్వాదం లభించాలంటే..
శని దేవుడి ఆశీర్వాదం పొందడానికి కొన్ని ప్రత్యేక పనులు కూడా చేయవచ్చు. శనివారం ఉదయం స్నానం చేసి రావి చెట్టుకు నీళ్ళు అర్పించడం చాలా పవిత్రం. ఈ నీటిలో గంగా జలం, నల్ల నువ్వులు, చక్కెర, పాలు కలిపిన నీటిని సమర్పించడం ద్వారా శని దేవుడు సంతోషిస్తాడట.
శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయనను పూజించడంతో పాటు దానం చేయడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. శనివారం నాడు నిరుపేదలకు మినపప్పు, నల్ల నువ్వులు, ఇనుప వస్తువులు, ఆవాల నూనె, నల్ల బట్టలు, బూట్లు దానం చేయడం వల్ల శని దేవుడి ఆశీస్సులు లభిస్తాయి.
శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి మరో ముఖ్యమైన మార్గం ఆయన మంత్రాన్ని జపించడం. శనివారం నాడు కనీసం ఐదు సార్లు శని దేవుడి మంత్రాన్ని జపించడం వల్ల శని అశుభ ప్రభావాలను తగ్గించవచ్చు. మరిన్ని ప్రయోజనాలను పొందాలనుకుంటే, శని దేవుడి మంత్రాన్ని 11 లేదా 19 సార్లు జపించవచ్చు.
శనివారం శని ఆలయంలో ఆవ నూనె దీపం వెలిగించడం కూడా ప్రయోజనకరం. ఇలా చేయడం ద్వారా జీవిత సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. పనిలో విజయం చేకూరడం ప్రారంభమవుతుంది.
ఎవరైనా శని దోషం, ఏలినాటి శని, శని మహాదశ వంటి వాటితో బాధపడుతుంటే వారు శనివారం నాడు నల్ల కుక్క, ఆవు లేదా కాకికి ఆహారం పెట్టాలి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి శని దేవుడి ఆశీస్సులు అలాగే ఉంటాయి.
శనివారం నాడు శని చాలీసా, హనుమాన్ చాలీసా పఠించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే హనుమంతుని ఆరాధిస్తే శని చెడు ప్రభావాలు తగ్గుతాయి.
*రూపశ్రీ
