శాస్త్రవేత్తలకే సవాల్ విసిరిన 5 అద్భుత శివాలయాలు ఇవే!  

మన చుట్టూ అనేక శివాలయాలు ఉన్నప్పటికీ..కొన్ని ఆలయాలు ప్రత్యేక రహస్యాన్ని కలిగి ఉంటాయి. వాటిలో ఈ 5 శివాలయాలు ఉన్నాయి. సైంటిస్టులకు సవాల్ విసురుతున్న ఈ 5 శివాలయాల రహస్యం ఏంటో తెలుసుకుందాం.

మహాశివుని మహిమ అపారమైనది. ఇతర దేవతలతో పోలిస్తే, శివుడిని ఆరాధించే భక్తులు అధిక సంఖ్యలో ఉంటారు. భారతదేశంలో అనేక శివాలయాలు ఉన్నాయి. అయితే కొన్ని శివాలయాలు చాలా ప్రత్యేకం. ఆ శివాలయాల్లో ఉన్న రహాస్యాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటివరకు చేధించలేకపోయారు. ప్రపంచంలోనే అతి పురాతనమైన శివాలయం నుండి, పిడుగుపాటు శివ లింగమాదవే వరకు, రోజుకు రెండుసార్లు అదృశ్యమై తిరిగి కనిపించే శివాలయం గురించి మీకు చెప్పబోతున్నాం. సైన్స్‌కు సవాలు విసిరిన ఈ 5 అద్భుతమైన శివాలయాల గురించి ఆసక్తికర విషయాలను తెలుకునే ప్రయత్నం చేద్దాం.

ప్రతిరోజూ మూడు రంగుల్లో కనిపించే శివలింగం:

రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఈ అద్భుతమైన శివాలయం ఉంది. ఈ శివాలయంలోని శివలింగం రంగు రోజుకు మూడు సార్లు మారుతుంది. ఉదయం శివలింగంపై ఎరుపు రంగు, మధ్యాహ్నం కుంకుమ వర్ణంలో శివలింగం దర్శనిమిస్తుంది. సాయంత్రం హారతి సమయంలో, శివలింగంపై శివుని నలుపు రంగు కనిపిస్తుంది.  మీరు రాజస్థాన్ వెళుతున్నట్లయితే, ఒక్కసారి అచలేశ్వర మహాదేవ్‌ని దర్శించండి.

ప్రతిరోజూ రెండుసార్లు శివలింగం మాయమవుతుంది:

గుజరాత్‌లోని స్తంభేశ్వర్ మహాదేవ ఆలయం అత్యంత అద్భుతమైన శివాలయాల్లో ఒకటి. ఈ ఆలయంలో శివలింగం రోజుకు రెండుసార్లు అదృశ్యమవుతుంది. కొంత సమయం తర్వాత తిరిగి కనిపిస్తుంది. శివునికి జలాభిషేకం చేయడానికి సగరుడు స్వయంగా వచ్చినప్పుడు శివుడు అదృశ్యమవుతాడని నమ్ముతారు. ఈ ఆలయం పేరు జంబూసర్ తహసీల్ స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఈ శివాలయం గుజరాత్‌లోని వడోదరకు 40 కి.మీ దూరంలో ఉంది.

పిడుగుపాటుకు విరిగిపోయిన శివాలయం:

కులు లోయలోని బిజిలీ మహాదేవ్ ఆలయం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పిడుగుపాటుకు గురవుతుంది. ఈ పిడుగు చాలా భయంకరంగా నేలను తాకుతుంది, పిడుగుపాటుకు శివలింగమే పగిలిపోతుంది. కానీ ఆలయ పూజారులు మరుసటి రోజు ఈ శివలింగాన్ని వెన్నతో తిరిగి ఏర్పాటు చేస్తారు. అప్పుడు శివలింగం మునుపటిలా దర్శనమిస్తుంది.

ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న శివాలయం:

భోజేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రపంచంలోనే అతి పురాతనమైన శివాలయంగా చెప్పబడుతోంది. దీనిని భోజ రాజు నిర్మించినట్లు చెబుతారు. సాధువుల బృందం కూడా ఈ ఆలయంలో కఠోర తపస్సు చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోజ్‌పూర్ అనే గ్రామంలోని ఈ శివాలయాన్ని మనం సందర్శించవచ్చు. అయితే నేటికీ ఈ ఆలయ నిర్మాణం పూర్తి కాలేదు. నేటికీ అది సగం నిర్మించిన శివాలయంగానే భక్తులకు దర్శనమిస్తోంది.

లక్షల రంధ్రాలతో కూడిన శివాలయం:

ఛత్తీస్‌గఢ్‌లోని లక్ష్మణేశ్వర్ మహాదేవ్ ఆలయం రహస్యమైన శివాలయాల్లో ఒకటి. ఈ ఆలయంలో 1 లక్ష రంధ్రాలు ఉన్నాయి. వాటిలో ఒక ప్రత్యేక రంధ్రం ఉంది, ఇది శివలింగానికి సమర్పించిన మొత్తం నీటిని ఒకేసారి పీల్చుకుంటుంది. ఈ రంధ్రాన్ని పాతాళం అంటారు. ఎప్పుడూ నీటితో నిండి ఉండే ఈ గుడిలో రంధ్రాలు ఎలా వచ్చాయని ఆశ్చర్యకరమైన విషయం..? గుడి గుంతల ద్వారా నీరు ప్రవహిస్తున్నప్పటికీ ఆలయంలో నీరు ఎందుకు తగ్గడం లేదనే విషయాన్ని నేటికీ శాస్త్రవేత్తలు గుర్తించలేకపోతున్నారు.


 


More Enduku-Emiti