LATEST NEWS
తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. శనివారం (సెప్టెంబర్ 7) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు  వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా అనుమతిస్తున్నారు.   దర్శనం.ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం   58,100 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 20 వేల 817 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం   రూ.3.39 కోట్లు వచ్చింది.
ఆయనో రాజ‌కీయ చాణుక్యుడు.. ఆర్థిక వేత్త‌.. ఐటీ రంగ నిపుణుడు.. టెక్నాల‌జీకి బ్రాండ్ అంబాసిడర్.. ఆప‌ద‌లో ఉన్న‌వారికి ఆప‌ద్భాంద‌వుడు.. క‌ష్ట‌ కాలంలో అండ‌గా నిలిచే పెద్ద‌న్న‌.. మొత్తంగా ఆయ‌న ప్ర‌జ‌ల మ‌నిషి.. ప్రజా నాయకుడు. ఇంకా చెప్పాలంటే.. ఏపీ ప్ర‌జ‌ల క్షేమం కోసం ఎంత‌దూర‌మైనా వెళ్లే జననేత. ఏపీని తాకిన ఎలాంటి ఉప‌ద్ర‌వ‌మైనా సీఎం కుర్చీలో ఆయ‌న‌ ఉన్నాడంటే తోక ముడ‌వాల్సిందే.. ఆయ‌నే ఎవ‌రో కాదు.. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఇవ‌న్నీ ఆయ‌న అభినుమాలు, టీడీపీ శ్రేణులు  మాట‌లే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న  తెలుగు ప్ర‌జ‌ల హృదయాంతరాళాలలోంచి గ‌ర్వంగా వస్తున్న పలుకులు.  మ‌రోసారి ఆ మాట‌లు అక్ష‌ర‌స‌త్యాల‌య్యాయి. చంద్ర‌బాబు సీఎం సీటులో ఉంటే.. ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌శాంతంగా జీవ‌నం సాగించొచ్చని మ‌రోసారి రుజువైంది.  గ‌తంలో విశాఖ‌.. నేడు విజ‌య‌వాడ‌. ప్ర‌కృతి ప్ర‌కోపానికి ఎదురొడ్డి నిల‌బ‌డ్డారు ఆ 74ఏళ్ల నవ యువ‌కుడు. విజ‌య‌వాడ వరదల్లో చిక్కుకున్న ప్రజలకు త‌న ప్రాణాల‌ను అడ్డుగా పెట్టి అండ‌గా నిలిచాడు. బాధితులంతా వ‌ర‌ద‌ ముంపు నుంచి బయటకు వచ్చేవరకూ తానూ ఓ వరద బాధితుడాగా గడిపారు.  ప‌గ‌లు రాత్రి అన్న తేడా లేకుండా, నిద్రాహారాలన్న ఊసే ఎత్తకుండా వ‌ర‌ద‌ల్లో  బోట్ల‌పై విస్తృత పర్యటనలు సాగించి బాధితుల్లో దైర్యాన్ని, స్థైర్యాన్ని నింపారు.. వారిని సుర‌క్షితంగా ఒడ్డుకు చేర్చాడు. దీంతో మొన్నటి ఎన్నిక‌ల్లో సాధించిన విజయం కంటే.. ఉగ్ర‌రూపందాల్చిన కృష్ణమ్మ‌ను శాంతింప‌ జేసి చంద్ర‌బాబు సాధించిన విజ‌యం వంద రెట్లు గొప్ప‌ది. ఏపీ ప్ర‌జ‌ల‌కు మొద‌టి నుంచి సీఎం చంద్ర‌బాబుపై అపార న‌మ్మ‌కం ఉంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ, నవ్యాంధ్రప్రదేశ్ లోనూ అయిన చంద్ర‌బాబు సీఎం కుర్చీలో ఉంటే మ‌న క‌ష్టాలు తీరుతాయ‌న్న న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో ఉంటుంది. అందుకే.. ఏపీ ఎప్పుడు క‌ష్టాల్లో కూరుకుపోయినా జనం చంద్ర‌బాబు వైపే చూస్తారు.  చంద్ర‌బాబు కూడా ఎన్నికలలో జయాపజయాలను  ప‌ట్టించుకోకుండా   నాలుగు దశాబ్దాలుగా మచ్చలేని చంద్రుడిలా ప్రజాజీవితంలో కొన‌సాగుతున్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో  తొమ్మిదేళ్లు సీఎంగా ప‌నిచేసిన చంద్ర‌బాబు నాయుడు అద్భుతాలు చేశారు.  ముఖ్యంగా హైద‌రాబాద్ వైపు ప్ర‌పంచం చూసేలా చేశాడు. రాష్ట్ర విభజన తరువాత పేరు తప్ప మరేం మిగలని విభజిత ఆంధ్రప్రదేశ్ ను అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టి  ప్ర‌పంచం మొత్తం ఏపీవైపు చూసేలా చేయాల‌ని చంద్ర‌బాబు ప‌ట్టుద‌ల‌తో ముందుకు సాగుతున్నారు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఎదురైన ప్ర‌కృతి విప‌త్తుల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొంటూ.. ప్ర‌జ‌ల‌కు నేనున్నాన‌ని భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు చంద్ర‌బాబు నాయ‌డు.  రాష్ట్రంలో భారీ వ‌ర్షాల కార‌ణంగా వ‌ర‌ద‌లు వ‌చ్చిన స‌మ‌యంలో..  ఏ ముఖ్య‌మంత్రి అయినా వ‌ర‌దల తీవ్ర‌త‌ను గ‌మ‌నించేందుకు ఏరియ‌ల్ స‌ర్వే చేస్తారు. లేకుంటే అధికారుల‌ను, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను అల‌ర్ట్ చేస్తూ బాధితుల‌కు అండ‌గా నిలిచే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. గ‌తంలో వైసీపీ హ‌యాంలో ప‌లు సంద‌ర్భాల్లో భారీ వ‌ర్షాల కార‌ణంగా వ‌ర‌ద‌లు సంభ‌వించిన స‌మ‌యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏరియల్ స‌ర్వే ద్వారా ముంపు ప్రాంతాల‌ను ప‌రిశీలించారు. కాలు కింద‌ కూడా పెట్ట‌లేదు. దీంతో ముంపు ప్రాంతాల‌ ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ, సీఎం చంద్ర‌బాబు నాయుడు అలాకాదు. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో ముంపుకు గురైన ప్రాంతాల్లోకి నేరుగా వెళ్తారు.. పీక‌ల్లోతు నీళ్లున్నా ప‌ట్టించుకోరు.. నేరుగా బాధితుల వ‌ద్ద‌కు వెళ్లి వారికి భ‌రోసా క‌ల్పిస్తారు. గ‌తంలో విశాఖలో హుదూద్ తుఫాన్ సృష్టించిన విల‌యం అంతాఇంతా కాదు.. ఆ తుఫాన్‌ రక్కసి ధాటికి సర్వం కోల్పోయిన ప్రజలు తల్లడిల్లిపోయారు. అలాంటి సమయంలో ప్రజలకు కావాల్సిన భరోసా ఇవ్వడమే కాదు. నేనున్నానంటూ చంద్రబాబు కొండంత అండగా నిలిచారు. నాలుగు గోడల మధ్య కూర్చొని సమీక్షలు చేయడం కాదు బస్సులోనే మకాం పెట్టి మరీ బాధితులకు   భుజం కాశారు. వ‌ర‌ద ప్రాంతాల్లో విస్తృత ప‌ర్య‌ట‌న‌లుచేస్తూ బాధితుల్లో మనోధైర్యం నింపి బతుకుపై ఆశను నింపారు. అధికారులను పరుగులు పెట్టించి మరీ కూలబడిపోయిందనుకున్న ప్రాంతాన్ని తిరిగి నిలబెట్టారు. నెలల వ్యవధిలో తుపాను గాయాన్ని తుడిచి విశాఖకు పూర్వవైభవం తీసుకొచ్చారు. అప్ప‌ట్లో విశాఖ ప్రాంత ప్ర‌జ‌లు ఎదుర్కొన్న ప‌రిస్థితి.. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ ప్ర‌జ‌ల‌కు ఎదురైంది. కుండ‌పోత వర్షానికి తోడు..  కృష్ణానదికి రికార్డు స్థాయిలో వ‌చ్చిన వ‌ర‌ద‌,  బుడ‌మేరు ముంపుతో  విజ‌య‌వాడ‌లోని అనేక ప్రాంతాల్లోకి మ‌నిషి లోతు వ‌ర‌ద‌ నీరు చేరింది. ఇళ్లు నీట‌మునిగాయి. ప్ర‌జ‌లు భ‌యంతో వ‌ణికిపోయారు. వెంట‌నే రంగంలోకి దిగిన చంద్ర‌బాబు నాయుడు.. నేనున్నాను మీకేం కాదు అంటూ వ‌ర‌ద బాధితుల్లో భ‌రోసా క‌ల్పించేందుకు వ‌ర‌ద నీటిలోకి దిగారు. బోటులో ముంపు ప్రాంతాలలోకి వెళ్లారు. పొక్లెయిలో ప్రయాణించి మరీ ముంపు ప్రాంతాల్లో విస్తృత ప‌ర్య‌ట‌న‌లు చేశారు. అధికారుల‌ను, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టించి త‌క్ష‌ణ‌మే ఆహార ప్యాకెట్లు, తాగునీరు అందించే ఏర్పాట్లు చేశారు.  వ‌ర‌ద బాధితులకు భరోసా ఇచ్చారు. తమను ఆదుకోవడానికి చంద్రబాబు ఉన్నారన్న ధైర్యాన్నిచ్చారు. ఆయన వచ్చారు ఇక భయం లేదు వ‌ర‌ద ముంపు నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ‌తాం అనే ధీమాను క‌ల్పించారు. ఐదు రోజులు నిర్విరామంగా వ‌ర‌ద బాధితుల‌కు ఆహారం, తాగునీరు అందించ‌ డంతోపాటు.. వర‌ద ముంపు నుంచి బ‌య‌ట‌ప‌డిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య ప‌నులు చురుగ్గా జ‌రిగేలా చ‌ర్య‌లు తీసు కున్నారు. గతంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రీ చేయని రీతిలో బుర‌ద‌తో నిండిపోయిన బాధితుల ఇళ్ల‌ను క్లీన్ చేయించే బాధ్య‌త‌ను తీసుకున్నారు. 74ఏళ్ల వ‌య‌స్సులో విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద బాధితులను కాపాడుకునేందుకు చంద్ర‌బాబు ప‌డిన క‌ష్టాన్నిచూసి తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లే కాదు.. దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు చంద్ర‌న్నా సెల్యూట్ అంటున్నారు.
గణపతి నవరాత్రి వేడుకలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌లు సిద్ధ‌మ‌య్యారు. ప‌ట్ట‌ణం, ప‌ల్లెల్లో వాడ‌వాడ‌లా గ‌ణ‌నాథుడి మండ‌పాలు ఏర్పాటు చేశారు.  సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడు భక్తుల నుంచి పూజలందుకోనున్నాడు. ప్ర‌తీ సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈ పండగను అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకొంటారు. తొమ్మిది నుంచి ప‌ద‌కొండు రోజుల పాటు గ‌ణేశ్ ఉత్స‌వాలు కొన‌సాగ‌నున్నాయి. ఆది దంపతుల(శివ, పార్వతులు) మొదటి కుమారుడైన గణపతిని పూజించనిదే ఏ పనీ ప్రారంభించరు.  వినాయ‌క చ‌వితి హిందువుల‌కు తొలి పండుగ‌. భాద్ర‌ప‌ద శుద్ధ చ‌వితి రోజే గ‌ణ‌నాథుడు పుట్టాడ‌ని పురాణాలు చెబుతున్నాయి. గ‌ణేషుడి ఆవిర్భావ గాథ‌లు పురాణాల్లో ర‌క‌ర‌కాలుగా చెప్ప‌బ‌డ్డాయి. శివ పురాణం ప్ర‌కారం.. ఒక‌సారి పార్వ‌తీదేవి స్నానం చేయ‌డానికి శ‌రీరానికి న‌లుగు పండిని రాసుకుంది. మిగిలిన న‌లుగు పండిని ఓ బొమ్మ‌ను త‌యారు చేసి దాని ప్రాణం పోసింది. అత‌నిని ద్వారం ద‌గ్గ‌ర కాప‌లాగా పెట్టింది. శివుడు లోప‌లికి వెళ్తుండ‌గా ద్వారం ద‌గ్గ‌ర బాలుడు అడ్డుకున్నాడు. ఇద్ద‌రి మ‌ధ్య యుద్ధం జ‌రిగింది. ఆగ్ర‌హంతో శివుడు ఆ బాలుడి త‌ల‌ను త్రిశూలంతో న‌రికివేశాడు. త‌ల తెగిప‌డి ఉన్న బాలుడిని చూసి పార్వ‌తీ దేవి క‌న్నీరుమున్నీరైంది. పార్వ‌తీదేవి బాధ‌ను చూడ‌లేకపోయిన శివుడు.. ఒక ఏనుగు త‌ల‌ను తీసుకొచ్చి అతికించి ప్రాణం పోశాడు. అత‌నికి గ‌జాన‌ణుడు అని పేరు పెట్టాడు. త‌న కార‌ణంగా ఆ బాలుడు వికార రూపాన్ని పొందాడ‌ని గ‌జాన‌నుడికి తొలిపూజ అందుకునేలా శివుడు వ‌ర‌మిచ్చాడు. దీంతో ప్ర‌తీయేడాది భాద్ర‌ప‌ద మాసంలో తొలి పూజ‌ను గ‌ణేశుడు అందుకుంటున్నాడు.  తెలుగు రాష్ట్రాల్లో ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడికి ప్ర‌త్యేక స్థానం ఉంది. ప్ర‌తీయేటా ఇక్క‌డ గ‌ణ‌ప‌తిని ద‌ర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లివ‌స్తుంటారు. ప్ర‌తీ ఏడాది ఒక ప్ర‌త్యేక అవ‌తారంలో ద‌ర్శ‌న‌మిచ్చే గ‌ణ‌నాథుడు.. ఈసారి 70 అడుగుల ఎత్తుతో శ్రీ స‌ప్త‌ముఖ మ‌హాశ‌క్తి గ‌ణ‌ప‌తిగా భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. గ‌ణ‌నాథుడి ఉత్స‌వాలు ఒక్క భారతదేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం జ‌రుపుకుంటారు. ఇంకా చెప్పాలంటే.. ముస్లిం దేశాల్లో కూడా జ‌రుపుకుంటారు. జపాన్, థాయ్‌లాండ్, శ్రీలంక దేశాలతోపాటు ముస్లింలు అత్యధిక సంఖ్యలోనున్న ఇండోనేషియాలోసైతం గణపతి పూజలందుకుంటున్నారు. 270 మిలియన్ల జనాభా కలిగిన ఆ దేశంలో 87 శాతం మంది ముస్లింలే. వారంతా విఘ్నేశ్వరుడిని పూజిస్తారు. ఇక భారత దేశంలో బహిరంగంగా ఒక సామాజిక ఉత్సవంగా వినాయక చవితి నవరాత్రులను నిర్వహించడం అన్నది మాత్రం స్వాతంత్ర్యోద్యమ సమయంలో భారతీయుల ఐక్యతా చిహ్నంగా నిర్వహించడం ఆరంభమైంది. ఇందుకు స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని నినదించిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ కారణం. 1894లో మహారాష్ట్ర పుణె కేంద్రంగా సర్వ జనైఖ్య గణేశ్ ఉత్సవాలకు ఆయన పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు ఒక సామాజిక ఉద్యమంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఆరంభమయ్యాయి. అలా మొదలైన గణేష్ చతుర్ధి ఉత్సవాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. 
తిరుపతి జిల్లా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతోందా? పరిస్థితులు చూస్తుంటే ఉప ఎన్నిక జరగక తప్పదన్నట్టు కనిపిస్తోంది. ఊహించని విధంగా సత్యవేడుకు ఉప ఎన్నిక ముంచుకొచ్చింది. సత్యవేడు ప్రస్తుత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీ మహిళా కార్యకర్తను లైంగికంగా వేధించిన కేసులో ఇరుక్కున్నారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఆదిమూలం మీద అత్యాచారం కేసు నమోదు అయింది. తిరుపతిలోని భీమాస్ ప్యారడైజ్ హోటల్లోని రూమ్ నంబర్లు 105, 106ల్లో ఆదిమూలం తనను శారీరకంగా హింసిస్తూ అత్యాచారం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదిమూలం రాసలీలలు నిర్వహించిన హోటల్ తాలూకు సీసీ టీవీ ఫుటేజ్‌ని కూడా పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మొన్నటిఎన్నికల సందర్భంగా జంప్ అయిన ఆదిమూలం తన అసలు పార్టీ లక్షణాలను కూడా తనవెంట తెచ్చుకున్నారు. తెలుగుదేశం మహిళా కార్యకర్త విషయంలో లైంగిక వేధింపులకు పాల్పడుతూ సీక్రెట్ కెమెరాలకు దొరికిపోయి తన బతుకును రచ్చ చేసుకున్నారు. వైసీపీలో అయితే ఇలాంటి వ్యవహారాలను పట్టించుకోరుగానీ, తెలుగుదేశంలో మాత్రం ఇది చాలా సీరియస్ వ్యవహారం. ఆదిమూలం రాసలీలల గురించి బయటపడిన వెంటనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదిమూలాన్ని సస్పెండ్ చేశారు. ఇంత రచ్చ అయిన నేపథ్యంలో ఆదిమూలం చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి తీవ్రమైన చర్య తీసుకోవడం తెలుగుదేశం పార్టీలోని క్రమశిక్షణకు తార్కాణంగా నిలుస్తుంది.  ఎమ్మెల్యే పదవికి ఆదిమూలం రాజీనామా చేశాక ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆదిమూలాన్ని పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం వుంది. మరి ఆదిమూలం మళ్ళీ తన సొంతగూటికి వెళ్ళి పోటీ చేసినా గెలిచే అవకాశాలు ఎంతమాత్రం లేవు. ఆదిమూలం సంగతి అలా వుంచితే, ఉప ఎన్నికలో సత్యవేడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేది ఎవరన్న ప్రశ్న అప్పుడే ఉదయించింది. మొన్నటి ఎన్నికల సందర్భంగా స్థానిక తెలుగుదేశం నాయకుడు జె.డి.రాజశేఖర్‌కి టీడీపీ టిక్కెట్ దక్కాల్సి వుంది. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి ఆదిమూలం మారడం వల్ల టిక్కెట్ ఆదిమూలానికే ఇవ్వాల్సి వచ్చింది. దాంతో జె.డి.రాజశేఖర్ నిరాశకు గురయ్యారు. అయితే క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి, ఆదిమూలం గెలుపుకు తనవంతు కృషి చేశారు. ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే జె.డి.రాజశేఖర్‌కే టిక్కెట్ దక్కే అవకాశం వుందని తెలుస్తోంది. ఇక వైసీపీ వ్యూహం ఎలా వుండబోతోందో చూడాలి. ఆదిమూలానికి క్లీన్ చిట్ ఇచ్చి ఆయన్నే సత్యవేడు నుంచి పోటీ చేయిస్తారా? లేక కొత్త అభ్యర్థిని ఎవరినైనా ఎంపిక చేస్తారా అనేది చూడాలి. మొన్నటి ఎన్నికలలో దారుణంగా ఓడిపోయిన వైసీపీ, సత్యవేడుకు కనుక ఉప ఎన్నిక వస్తే ఈ స్థానాన్ని సొంతం చేసుకుని తన మీద వున్న ‘11’ ముద్రను చెరుపుకోవడానికి తీవ్రంగా కృషి చేసే అవకాశం వుంది.
తెలంగాణ  ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పదవికి మరో కాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్ పోటీ పడ్డారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఇకనుంచి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తారని ఎఐసిసి పేర్కొంది. రెండు వారాలక్రితమే పిసిసి అధ్యక్ష పదవికి మహేష్ కుమార్ గౌడ్ పేరు అనధికారికంగా ఖరారైనప్పటికీ శుక్రవారం అధికారికంగా ఖరారైంది. మహేష్ నియమితులైన తర్వాత రేవంత్ రెడ్డి పిసిసి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ అప్డేట్స్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు 'గేమ్ ఛేంజర్' నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. (Game Changer Second Single) థమన్ సంగీతం అందిస్తున్న 'గేమ్ ఛేంజర్' నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ గా 'జరగండి' సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. నేడు వినాయక చవితి సందర్భంగా సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సెకండ్ సింగిల్ ను ఈ సెప్టెంబర్ నెలలోనే విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ ఒక పోస్టర్ ను వదిలారు. పోస్టర్ కలర్ ఫుల్ గా ఉంది. ముఖ్యంగా రామ్ చరణ్ క్లాస్ దుస్తులు వేసుకొని, తలకి ఎర్ర తువాలు కట్టుకొని స్టైలిష్ గా ఉన్నాడు. పోస్టర్ ని బట్టి చూస్తే సెకండ్ సింగిల్ అదిరిపోయే డ్యాన్స్ నెంబర్ అనిపిస్తోంది. కియారా అద్వాణి హీరోయిన్ గా నటిస్తున్న ఎస్.జె.సూర్య, అంజలి, సునీల్‌, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
‘Devara: Part 1’ is gearing up to be one of the biggest Indian films of 2024, and the anticipation is growing following glimpses and chartbuster songs from the film starring NTR Jr, the Man of Masses. Janhvi Kapoor is playing female lead. This epic saga will be released worldwide on September 27th. The film Devara is generating unprecedented excitement and anticipation, largely fueled by its dynamic teaser, striking posters, and chartbuster songs. As we've reported, the trailer of Devara set to release on September 10th, fans are eagerly waiting for the next big glimpse of this highly anticipated film. The team behind Devara is gearing up to deliver a spectacular treat, and the trailer will offer a glimpse of the mass action and grandeur to come. NTR’s intensity, combined with Koratala Siva’s storytelling, ensures that Devara Trailer will stun everyone. The trailer will be launched grandly in Mumbai and whole team will attend. The buzz surrounding the film in the USA is nothing short of phenomenal. Prathyangira Cinemas is set to orchestrate the largest-ever release for NTR in America, marking a significant milestone. Recent reports reveal that pre-booking for Devara in the US has been a tremendous success, with pre-sales for premieres already exceeding $625K mark. The growing enthusiasm among fans is palpable, with many rushing to secure their seats well in advance. As the pre-sale figures continue to climb, it becomes increasingly evident that Devara is poised for a record-breaking debut in the American market. The film will have grand premieres in USA on September 26th. Versatile actor Saif Ali Khan, who plays the antagonist "Bhaira" in the film. Devara Part 1 will be releasing worldwide grandly on September 27th in Telugu, Tamil, Hindi, Kannada and Malayalam. Kalyan Ram presents this movie under ‘NTR Arts’ while Sudhakar Mikkilineni and Kosaraju Harikrishna are the producers. NTR Arts and Yuvasudha arts banrkolling the film.
Chetan Krishna and Hebah Patel star as the leading characters in the movie Dhoom Dhaam, which also features Sai Kumar, Vennela Kishore, Prithviraj, and Goparaju Ramana in significant roles. The film is produced by MS Ram Kumar under the Friday Frame Works banner. Dhoom Dhaam is a love and family entertainer directed by Sai Kishore Macha. Gopi Mohan has provided the story and screenplay. The film is gearing up for a grand theatrical release on the 13th of this month. In the lead-up to the release, the movie’s promotions have extended to America. Recently, the song "Mallepoola Taxi" from Dhoom Dhaam was screened at the renowned Times Square in New York. A large number of NRIs attended the screening, with Telugu people enthusiastically dancing to the song. The vibrant celebration attracted considerable attention from the American audience. The US premieres of Dhoom Dham are set to begin on the 12th of this month. With rich production values, the movie "Dhoom Dham" is going to hit the screens on September 13.
Popular actor and dubbing artiste P. Ravishankar is introducing his son Advay as a hero with his latest directorial venture “Subrahmanyaa”. Thirumal Reddy and Anil Kadiyala are bankrolling this socio-fantasy adventure prestigiously under the banner of SG Movie Creations. Smt Praveena Kadiyala and Smt Ramalakshmi present the movie which had its pre-look unveiled recently to superb response. On the auspicious occasion of Vinayaka Chaturthi, the makers of Subrahmanyaa unveiled the film’s first look poster. The poster launched by Kannada superstar Dr. Shiva Rajkumar introduces Advay in the titular role as Subrahmanyaa. Sporting long hair and a beard, Advay looks handsome and elegant in the poster in a specially designed outfit, though he gives a serious gaze. We can see the intensity in his eyes. He is in jungle and at the entrance of a mysterious place with goons chasing him. The first look poster grabs everyone’s attention. With 60% of production completed, post-production is actively underway at Red Chillies Studios in Mumbai. VFX and CGI work is also in progress at leading studios across Mumbai, Hyderabad, Bangalore, and Chennai. The film boasts top-notch technical expertise, with music by Ravi Basrur (known for KGF and Salaar), cinematography by Vignesh Raj, editing by Vijay M Kumar, and production design by Ullas Hydur (Sapta Sagaradache and Charlie 777). Subrahmanyaa is set for a Pan India release in Telugu, Kannada, Tamil, Malayalam, and Hindi.
Mathu Vadalara 2 is one of the most awaited sequels, and the movie starring Sri Simha Koduri, Satya, and Faria Abdullah made a lasting impression with the wacky teaser. The film is directed by Ritesh Rana, and produced by Chiranjeevi (Cherry) and Hemalatha Pedamallu under the banners of Clap Entertainment and Mythri Movie Makers. Today, the makers unleashed a promotional song called Drama Nakko Mama. It starts with Sri Simha expressing his unhappiness due to no progress in life with no proper income. Faria Abdullah who is also their colleague gives them enlightenment with regard to easy money and unnecessary drama.  This rocking promotional song was composed by Kaala Bhairava. Faria Abdullah penned the song, and also lent vocals. What's more, she also did the choreography, along with Agam Anand, Dinesh Charleston, and Apooh Mahi. She wrote the lyrics in Hindi in Hyderabad style.  Drama Nakko Mama was shot vividly in some vibrant sets, while Faria Abdullah shined as a lyric writer, singer, and choreographer. Her dances are also truly eye-candy. The promotional song further augmented the prospects for the movie. Suresh Sarangam is the cinematographer, while Karthika Srinivas R is the editor. Mathu Vadalara 2 will be hitting the screens on September 13th.
"Jailer" stands out as Rajinikanth's biggest hit to date. The veteran actor was deeply impressed by the film's script, though he portrayed a common man who skillfully balanced his heroism alongside co-stars like Mohanlal, Shiva Rajkumar, and Jackie Shroff. In several scenes, these actors played pivotal roles in driving the narrative forward. It takes considerable courage for an actor to accept such a role and share significant screen time with others. This approach proved highly successful for "Jailer." Rajinikanth appears to be employing a similar strategy for his upcoming film, "Coolie." The movie will feature prominent roles by Nagarjuna, Upendra, Satyaraj, Soubin Shahir, and Shruti Haasan. It remains unclear whether these actors will have cameo appearances or substantial parts, but Rajinikanth seems intent on repeating the successful formula from "Jailer." The ensemble cast is expected to be a major asset for "Coolie," just as it was for "Jailer." The film will include a range of actors alongside Rajinikanth, which could be a significant advantage in terms of both storytelling and audience engagement. This approach reflects a strategic choice to leverage a strong supporting cast. "Coolie" is an action drama centered around the gold smuggling mafia, directed by Lokesh Kanagaraj. The film will be produced by Sun Pictures, with music and background score composed by Anirudh. "Coolie" is set to release next year, promising to be another high-profile project for Rajinikanth.
Natural Star Nani’s "Saripodhaa Sanivaaram" debuted last week and saw respectable numbers over the weekend. However, the film’s performance during the weekdays was affected by ongoing rains and floods in the Telugu states.  Additionally, the re-release of Pawan Kalyan’s "Gabbar Singh" has further diminished the foot traffic for "Saripodhaa Sanivaaram." The recent release of Vijay’s "GOAT" has also negatively impacted with poor reviews and saw lackluster openings across the Telugu states. Other films scheduled for release, such as Suhas’ "Janaka Aithe Ganaka" and Raj Tarun’s "Bhale Unnade," have been delayed, leaving limited choices for moviegoers this weekend. With Saturday being Vinayaka Chavithi, "Saripodhaa Sanivaaram" is anticipated to benefit from increased audience attendance over the weekend. GOAT saw significant drop in collections from Day 2 and there is no competition for Saripodhaa Sanivaaram at the box office. The film is expected to generate better earnings in the next couple of days, leveraging the weekend's boost.  "Saripodhaa Sanivaaram," directed by Vivek Athreya, features Nani, Priyanka Mohan, and SJ Suryah in lead roles. Produced by DVV Danayya, the film is an action thriller that aims to capitalize on the weekend to improve its box office performance.
సెప్టెంబర్ 27న విడుదల కానున్న 'దేవర' (Devara) సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ మూవీ నుంచి వచ్చే ఒక్కో అప్డేట్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోంది. తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది. (Devara Trailer On Sep 10th) నేడు వినాయక చవితి సందర్భంగా 'దేవర' ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. సెప్టెంబర్ 10న ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ప్రత్యేక పోస్టర్ ను వదిలారు. నల్ల దుస్తులు ధరించి, చేతిలో ఆయుధం పట్టుకొని సముద్రతీరంలో నిల్చొని ఉన్న ఎన్టీఆర్ లుక్ పవర్ ఫుల్ గా ఉంది. 'దేవర' నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మరి ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'దేవర'లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. 
Young and talented actor Tejus Kancherla, who impressed audiences with his diverse role in "Hushaaru," is back with his latest film, "Uruku Patela." With the tagline "Get Urikified," the movie is directed by Vivek Reddy under the Lead Edge Pictures banner and produced by Kancherla Bala Bhanu. The music is composed by Praveen Lakkaraju, and cinematography is handled by Sunny Kurrapati. The teaser and trailer have heightened expectations for the film, which will be released on September 7 as a Vinayaka Chavithi special. Here’s what Tejus Kancherla shared with the media: - "After 'Hushaaru,' I heard many stories and wanted something fresh. When Vivek presented this story, I was excited. We developed the script together, and now the movie is complete." - "The script was ready, and we pitched it to many producers. While they all liked the story, no one was willing to invest the necessary budget. Eventually, my father heard the story, liked it, and decided to produce the film." - "The film is set in a Telangana backdrop with an accent that is easily understandable to everyone. Since I was born and raised in Hyderabad, the accent wasn’t an issue for me." - "The teaser and trailer provide a glimpse into the film’s plot and tone. We aimed to give audiences a hint about what to expect, which is why we released these promotional materials." - "Although the trailer might suggest that the movie revolves around the heroine, the actual film offers a different experience. The title 'Uruku Patela' and the film’s content are designed to justify the name and keep you laughing throughout." - "The heroine is from Uttarakhand. After seeing her reel, I contacted her, and she participated in workshops and acted as directed. There were no issues during filming." - "If this film succeeds and proves profitable, I might consider producing future projects. However, I won’t be handling both production and acting simultaneously, as it’s quite challenging." - "'Uruku Patela' is a film that the whole family can enjoy together. It’s filled with humor. Inspired by various superstitions I read about during the lockdown, we crafted this story as a blend of thriller and comedy for complete entertainment." - "I have a desire to direct in the future. I’m open to contributing to stories that come my way and love writing. If I find a role that excites me and seems fun, I’m open to doing special roles."
King Of Content Sree Vishnu and talented director Hasith Goli's duo enchanted one and all with the hilarious teaser of Swag. The teaser besides introducing various characters of Sree Vishnu also showed the premise of the movie set in different timelines. TG Vishwa Prasad is producing the film on People Media Factory. Vivek Sagar provided music for the movie and the first single Singaro Singa was a chartbuster. The second single- Guvva Gootilo from the film has just been unveiled. Sree Vishnu rocks as Yayathi, the charismatic head of the Yayathi Dance Troupe. The song takes a nostalgic dive into the past with its retro beats and stylish choreography, representing the essence of the 80s and 90s musical landscape. The retro-themed composition by Vivek Sagar is perfectly complemented by the peculiar lyrics of Bhuvana Chandra. With the dynamic trio of Mano, Geetha Madhuri, and Snigdha Sharma lending their electrifying vocals, the track is a feast for the viewers. Sireesh Kumar choreographed retro-style dance moves. Set against a colorful Jathara backdrop, Guvva Gootilo promises to be a treat for masses, particularly with the Ganesh Chaturthi festival around the corner. Ritu Varma is playing the lead actress- Queen Rukmini Devi from Vinjamara Vamsham. Vedaraman Sankaran cranks the camera, whereas Vivek Sagar provides the music and Viplav Nyshadham is the editor. The other technicians include GM Shekar handling the art department, while Nandu master takes care of stunts. Vivek Kuchibhotla is the co-producer. The film Swag is scheduled for its theatrical release on October 4th.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఏకార్యాన్నైనా ప్రారంభించే ముందు ప్రథమంగా వినాయకుణ్ణి పూజించడం మన సంప్రదాయం. విఘ్నాలను తొలగించమని మానవులే కాదు దేవతలు కూడా విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తారని పురాణాలు పేర్కొన్నాయి. వినాయకుణ్ణి పూజించడం వల్ల 'మహా' విఘ్నాత్ ప్రముచ్యతే మహా దోషాత్ ప్రముచ్యతే...' 'మహా విఘ్నాలన్నీ తొలగిపోతాయి, మహా దోషాలన్నీ అంతమై పోతాయి' అని 'గణపతి అథర్వశీర్ణోపనిషత్తు' వివరిస్తోంది. మదిలో తలచిన వెంటనే విఘ్నాలను తొలగించే దేవుడు. వినాయకుడు. అందువల్ల 'తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని, తలచిన పనిగా దలచితినే హేరంబుని, తలచితి నా విఘ్నముల దొలగుట కొఱకున్' అంటూ వినాయకుణ్ణి ప్రార్థిస్తాం. ఎవరు ఏది కావాలని కోరుకుంటారో వారికి దాన్ని ప్రసాదించే సులభ ప్రసన్నుడు వినాయకుడు. సకల ఐశ్వర్యాలను కోరుకునేవారికి 'లక్ష్మీగణపతి'గా, సిద్ధులను  కోరుకునేవారికి 'సిద్ధగణపతి'గా విద్యలను కోరుకునే వారికి 'అక్షర గణపతి'గా... ఇలా గణపతిని ఏయే రూపాల్లో ఉపాసిస్తే  ఆయా ఫలితాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. విద్యార్థులకు ప్రియతముడు వినాయకుడు.  అందుకే జ్ఞానప్రదాత అయిన వినాయకుడు విద్యార్థులకు అత్యంత ప్రియతముడయ్యాడు. విద్యార్థులు వినాయక చవితి రోజున వినాయకుని ప్రతిమ ముందు పుస్తకాలను ఉంచి, తమకు విద్యాబుద్ధులను ప్రసాదించమని  'కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ ఓయి. గణాధిప నీకు మ్రొక్కెదన్' అంటూ భక్తి శ్రద్ధలతో గణనాథుణ్ణి ప్రార్థిస్తారు. అయితే మనకు కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించమని అక్షర గణపతిని ప్రార్థిస్తే తప్పక అనుగ్రహిస్తాడు. కానీ ఆ జ్ఞాననిధిని వృద్ధి చేయడానికి మన వంతు కృషి చేయాలి. ఏకాగ్ర చిత్తం..  ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తాం. కానీ ఆ జ్ఞానాన్ని శీఘ్రంగా పొందాలంటే ఏకాగ్ర చిత్తంతో అధ్యయనం చేయాలి. ఏకాగ్రత లేని మనస్సుతో ఎన్ని గంటలు శ్రమించినా, ఎన్ని రోజులు కృషి చేసినా అది వేడి పెనం మీద పడిన నీటి చుక్కలా వెంటనే ఆవిరైపోతుందే కానీ ఎంతోకాలం నిలవదు.  మనస్సును ఒక విషయంపై ఒక్క క్షణమైనా ఏకాగ్రం చేయలేకపోతున్నవారు ఏకాగ్రత అంటే ఎలా ఉండాలో వినాయకుని జీవితంలోని ఓ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు. మహాభారత కథను ప్రపంచానికి అందించాలన్న ఆలోచన వ్యాసుడికి కలిగింది. 'నేను చెబుతుంటే ఈ మహాగ్రంథాన్ని వ్రాయగల సమర్థులెవరైనా ఉన్నారా?' అని బ్రహ్మను అడిగాడు. 'నీ సంకల్పాన్ని నెరవేర్చగల సమర్థుడు వినాయకుడు ఒక్కడే' అని బ్రహ్మ సలహా ఇచ్చాడు. వెంటనే వ్యాసుడు వినాయకుణ్ణి ప్రత్యక్షం చేసుకొని తన విన్నపాన్ని తెలిపాడు. అందుకు వినాయకుడు అంగీకరించాడు. కానీ వ్యాసుడు, 'గణనాథా! నేను భారత కథను చెబుతూ ఉంటాను. మీరు ఆగకుండా వ్రాస్తూ ఉండాలి' అని షరతు పెట్టాడు. అందుకు వినాయకుడు కూడా "నేను ఒకసారి వ్రాయడం మొదలు పెడితే నా ఘంటం ఆగదు. కాబట్టి అలా ఆగకుండా కథను చెప్పాలి" అని షరతు పెట్టాడు. అందుకు వ్యాసుడు, 'నేను చెప్పినదాన్ని అర్థం చేసుకుంటూ 'వ్రాయాలి' అని వినాయకునికి మరో షరతు పెట్టాడు. ఒకరి షరతులకు మరొకరు అంగీకరించిన తరువాత వ్యాసుడు మహాభారత కథను చెబుతూ ఉంటే వినాయకుడు వ్రాశాడు. ఆ విధంగా 'పంచమ వేదం'గా ప్రఖ్యాతి గాంచిన మహాభారతం మనకు లభించింది. వ్యాసుడు నిర్విరామంగా చెప్పిన భారత కథను అర్థం చేసుకుంటూ, నిరాటంకంగా వ్రాసిన వినాయకుని ఏకాగ్రతాశక్తి అనితర సాధ్యమైనది. ప్రశాంత చిత్తం.. జ్ఞాన సముపార్జనకు ఏకాగ్రచిత్తం అవసరమే..  అయితే  మనస్సును ఏ విషయంపైన అయినా ఏకాగ్రం చేయాలంటే ప్రశాంతత అవసరం. అలజడితో అల్లకల్లోలమైన చిత్తాన్ని ఏ విషయం పైనా నిమగ్నం చేయలేం. చంచలమైన మనస్సుతో సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనలేం. దేవగణాలకు అధిపతిని నియమించాలని పార్వతీ పరమేశ్వరులు సంకల్పించారు. అందుకు వినాయకుడు, కుమారస్వామి.. వీరిద్దరిలో ఎవరు సమర్థులో తెలుసుకోవాలని 'ముల్లోకాలలోని పుణ్యతీర్థాలను సందర్శించి, ఎవరు ముందుగా వస్తారో వారిని గణాధిపతిగా నియమిస్తాను' అని శివుడు ఓ పోటీ పెట్టాడు. ఈ విషయాన్ని విన్న వెంటనే కుమారస్వామి నెమలి వాహనంపై పయనమయ్యాడు. కానీ మూషిక వాహనంపై ముల్లోకాలను సందర్శించి రావడం వినాయకునికి అసాధ్యం. వినాయకుడు తన అసహాయతకు అలజడి చెందకుండా, మనోనిశ్చలతను కోల్పోకుండా ప్రశాంతంగా పరిష్కారాన్ని ఆలోచించాడు. 'తల్లితండ్రులకు ప్రదక్షిణ చేస్తే ముల్లోకాల్లోని పుణ్యతీర్థాలను సందర్శించిన ఫలితం లభిస్తుంది. అన్న ధర్మసూక్ష్మాన్ని గ్రహించిన వినాయకుడు వెంటనే పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చేశాడు. ఆదిదంపతులు వినాయకుని బుద్ధి కుశలతకు సంతసించి, గణాధిపతిగా నియమించారు. పరిశుద్ధ చిత్తం..  మనస్సు ఏకాగ్రతను సాధించాలంటే ప్రశాంతచిత్తంతో పాటు  పరిశుద్ధచిత్తం అవసరం. అందుకు మనస్సులో ఎలాంటి వికారభావాలూ కలగకుండా జాగ్రత్త వహించాలి. అది బ్రహ్మచర్యాన్ని అభ్యసించడం వల్లనే సాధ్యమవుతుంది. ఒకసారి వినాయకుడు చిన్నప్పుడు ఆడుకుంటూ పిల్లిని కొట్టాడు. పిల్లికి ముఖంపై గాయమైంది. ఆట ముగించుకొని వినాయకుడు తన తల్లి పార్వతి దగ్గరకి వెళ్ళాడు. ఆమె ముఖంపై గాయాన్ని చూసి ఆశ్చర్యంతో 'అమ్మా! నీ ముఖంపై ఈ గాయం ఎలా అయ్యింది?' అని అడిగాడు. అందుకు పార్వతీదేవి, 'నాయనా! సర్వజీవుల్లో ఉన్నది నేనే. నువ్వు పిల్లి ముఖాన్ని గాయపరచడం వల్ల నా ముఖానికి కూడా గాయమైంది' అని చెప్పింది. సర్వజీవుల్లోనూ తల్లి పరమేశ్వరి కొలువై ఉందని తెలుసుకొన్నాడు వినాయకుడు. అలా సర్వజీవుల్లోనూ తల్లినే దర్శించిన వినాయకుని మనస్సులో ఎలాంటి అపవిత్ర భావాలూ కలిగేందుకు తావే లేదు. జ్ఞానసముపార్జనకు ముఖ్య సాధనాలైన ఏకాగ్ర చిత్తం, ప్రశాంత చిత్తం, పరిశుద్ధ చిత్రాలను ఆ వినాయకుడే ప్రసాదించగలడు. కాబట్టి ఆయన్ను శరణు వేడాలి.                                          *నిశ్శబ్ద.
ప్రతి ఇంట్లో ఖచ్చితంగా వినాయకుడి విగ్రహం ఉండనే ఉంటుంది.  మరీ ముఖ్యంగా వినాయక చవితి అంటే తప్పనిసరిగా ఎలాంటి పేదలు అయినా సరే.. తమకున్న స్థోమతలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజ చేసుకుని ఆ స్వామి ఆశీర్వాదం పొందుతారు. అయితే వినాయకుడు కేవలం దేవతగానే కాకుండా ఆయన రూపం చాలా విషయాలు చెప్పకనే చెబుతుంది.  ఇంతకీ వినాయకుడి విగ్రహం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? తెలుసుకుంటే.. వినాయకుడికి పెద్ద తల ఉంటుంది.  తల పెద్దగా ఉండటం అంటే పరిమాణం కాదు.. ఆలోచనలు మెరుగ్గా ఉండాలని అర్థం. మెరుగ్గా ఆలోచించే వారు వ్యక్తిత్వ పరంగా మెరుగ్గా ఉంటారు. వినాయకుడి చెవులు చాలా పెద్దగా ఉంటాయి.  ఈ పెద్ద చెవులు శ్రద్ధగా వినమని చెబుతాయి.  ఏది చెప్పినా శ్రద్దగా వినేవారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. వినాయకుడి కళ్లు చాలా చిన్నగా ఉంటాయి. ఈ చిన్న కళ్ళు సూక్ష్మ విషయాలను కూడా చాలా పరిశీలనగా దృష్టి కేంద్రీకరించి చూడాలని చెబుతాయి. వినాయకుడి శరీర పరిమాణానికి తగ్గట్టు చూస్తే  నోరు చిన్నది.  చిన్న నోరు తక్కువ మాట్లాడమవి చెబుతుంది. తక్కువ మాట్లాడేవారు ఎప్పుడూ ఉత్తములు. వినాయకుడికి పెద్ద బొజ్జ ఉంటుంది. మంచి చెడులను జీర్ణించుకోవాలని ఈ పెద్ద బొజ్జ సూచిస్తుంది. పొడవాటి తొండం..  ప్రతికూలతను కూడా అనుకూలతగా మార్చుకోవాలని చెబుతుంది. అదే మనిషి బలాన్ని పెంచుతుందని చెబుతుంది. చేతులు.. ఆశీర్వదించడానికి  రక్షించడానికి ఎప్పుడూ ముందుండాలనే ఉద్దేశ్యాన్ని వినాయకుడి ఆశీర్వాద భంగిమ సూచిస్తుంది. వినాయకుని దంతాలలో ఒకటి విరిగిపోయి ఉంటుంది. విరిగిన దంతానికి ప్రతీక ఏమిటంటే తెలివైన వ్యక్తి ద్వంద్వత్వానికి అతీతంగా ఉంటాడు. అంటే  ఒకే దంతము  ఏక కోణాన్ని సూచిస్తుంది. గణేశుడి నాలుగు భుజాలు నాలుగు గుణాలకు ప్రతీక - అవేంటంటే... మనస్సు, బుద్ధి, అహంకారం,  మనస్సాక్షి. వినాయకుడు  ఒక కాలు పైకి లేపి, మరొకటి నేలపై ఉంచి కూర్చుని ఉంటాడు. ఇది  ఆధ్యాత్మిక,  భౌతిక ప్రపంచాలు రెండింటిలోనూ పాల్గొనాలని సూచిస్తుంది.                                                     *రూపశ్రీ.
ఒక రాజు తను ఎంతగానో ప్రేమించిన భార్య మరణించింది. ఆయన ఆది తట్టుకోలేకపోయాడు. ఆమె తన ప్రాణంగా జీవించేవాడు. ఆమె మరణంతో అతను విలవిలలాడిపోయాడు. ఎన్నో ఏళ్ళు ఆమెనే తల్చుకుంటూ నిరంతర దుఃఖ స్రవంతిలో మునిగిపోయాడు. ప్రజల పాలనను, రాజ్యం యొక్క బాగోగులను మర్చిపోయాడు. ఎందుకంటే తన భార్య కంటే ముఖ్యమైనది, ఈ సృష్టిలో ఏదీ లేదని అతను భావించాడు. తిండి తిప్పలు మానేసి పిచ్చివాడిలా రోధిస్తూ ఉండేవాడు. ప్రజల పరిస్థితి దీనావస్థకు చేరుకుంది. శత్రువులు ఇష్టారాజ్యంగా దోచుకెళ్ళడం ప్రారంభించారు. సరైన సౌకర్యాలు లేక ప్రజలు అస్తవ్యస్తమైపోయారు. ఆ సమయంలో ఓ సాధువు పరిస్థితి గమనించి ఆ రాజు గారిని కలిశాడు.  "రాజా..... సుభిక్షంగా పాలించాల్సిన నీవే ఇలా అయిపోతే ఎలా?" అని అడిగాడు.  దానికి రాజు "ఈ రాజ్యం, ఈ ప్రజలు, ఈ సంపదలూ...... ఇవేవీ నా దుఃఖాన్ని దూరం చేయలేవు. నా రాణిని నాకు తిరిగి తెచ్చిపెట్టలేవు. ఆమె లేని ఈ జీవితమే వ్యర్థం. ఆమె కంటే ముఖ్యమైనది నాకేదీ లేదు" అని జవాబిచ్చాడు.  అందుకు సాధువు నవ్వి ఇలా అన్నాడు "ఓ రాజా.... ఇదంతా చూస్తుంటే.. నీ రాణిని నీవు నిజంగా ప్రేమించడం లేదేమో అనిపిస్తోంది! నీ ప్రేమ స్వచ్ఛమైనది కాదేమోననిపిస్తోంది…"అన్నాడు.  దానికి రాజు చాలా ఆగ్రహించాడు. "ఏంటీ. నాది స్వచ్ఛమైన ప్రేమ కాదా... ఏమి లేకపోయినా ఆమె జ్ఞాపకాలతో బ్రతికేయగలను. అయినా నాది  అని స్వచ్ఛమైన ప్రేమ కాదని మీరెలా అనగలరు?" అని అడిగాడు. దానికి సాధువు. "ఓ రాజా మీరు ఓ అందమైన, గుణవతి అయిన స్త్రీని మళ్ళీ వివాహం చేసుకోండి. ఒక  సంవత్సరం తర్వాత కూడా.... మీరిలాగే ఆమె జ్ఞాపకాలతో, దుఃఖంలో జీవిస్తున్నట్లు కన్పిస్తే...  అప్పుడు ఖచ్చితంగా మీ ప్రేమ ప్రపంచంలో కెల్లా స్వచ్చమైనదని అర్థం" అన్నాడు. రాజు తనది స్వచ్చమైన ప్రేమేననీ, దానిని నిరూపించడం కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమేననీ, మళ్లీ ఓ యువతిని వివాహం చేసుకోవడానికైనా సిద్ధమని సాధువుతో చెప్పి, కొంత కాలంలోనే ఓ అప్సరసలాంటి అనుకూలవతియైన వనితను వివాహమాడాడు. సంత్సరకాలం గడించింది. ఆ సాధువు మళ్ళీ ఆ రాజ్యంలోకి వచ్చి చూశాడు. ప్రజలంతా సర్వ సుఖాలతో, సుభిక్షంగా ఉండటం గమనించాడు. రాజు గారి దగ్గరికెళ్ళి చూడాలనుకున్నాడు. ఆ సాధువును చూడగానే ఆ రాజు  ఆనాడు తాను చెప్పిన మాటలను తల్చుకొని ఎంతో చిన్నబోయుడు. ఆ రాజు తన క్రొత్త భార్యతో, ఆనందడోలికల్లో మునిగి ఎంతో ఉల్లాసంగా ఉండటం సాధువు గమనించాడు. సాధువును చూడగానే రాజు ఇలా అన్నాడు. "స్వామీ.. నేను ఓడిపోయాను, నాది స్వచ్ఛమైన ప్రేమకాదని తెల్సుకొన్నాను. నేను మరో స్త్రీని పెళ్ళాడిన తర్వాత క్రమ క్రమంగా నా రాణి జ్ఞాపకాలను మరిచిపోయి ఆనందంగా ఉండగలిగాను...... కనుక నా రాణి పట్ల నాకు అంత స్వచ్ఛమైన ప్రేమలేదని తెలిసింది. నన్ను క్షమించండి" అని వివరణ ఇచ్చాడు.  దానికి సాధువు నవ్వుతూ "రాజా స్వచ్ఛమైన ప్రేమంటే ఒక వ్యక్తి కోసం కుమిలి కుమిలి రోధించడం కాదు, చనిపోయిన నీ భార్యని తలచుకుంటూ దుఃఖం అనే బానిసత్వంలో బంధీగా ఉండటం కాదు. నీవు నీ ప్రేమని. మరో వ్యక్తికి కూడా నిష్కల్మషంగా పంచగలిగావు. ఈ రాజ్య ప్రజల ప్రేమకు పాత్రుడవగలిగావు. నీ విధిని గుర్తించి మేలుకొని కర్తవ్యపాలన చేశావు. ప్రేమ కంటే బాధ్యత గొప్పది, బాధ్యత లేని ప్రేమ ఓ ఎండమావి లాంటిది. అయినా నీది స్వచ్ఛమైన ప్రేమే.  ప్రేమ అంటే స్వేచ్ఛ, ప్రేమ అంటే స్వచ్ఛత. ఎప్పుడైతే నీవు దుఃఖం, జ్ఞాపకాలు అనే బానిసత్వంలో ఉండినావో..... సమస్తం నీకు చీకటిగానే కన్పించింది. నీవు మళ్లీ మరో స్త్రీని నీ జీవితంలోకి ఆహ్వానించడంతో  ఆనందంగా గడపగలిగే మరో అవకాశాన్ని పొందగలిగావు. అప్పుడు నీవు దుఃఖంలో ఉండి అందరినీ సంతోషాలకు దూరం చేశావు. మళ్ళీ మరో ఆనందాన్ని వెదికి పట్టుకొని ప్రజలందరి సంతోషాలనూ తిరిగి తెచ్చి పెట్టగలిగావు. నిజమైన ప్రేమంటే ఆనందమే, నిరంతరం దుఃఖంలో ఉండటం నిజమైన ప్రేమకు నిదర్శనం కాదు. ఇతరుల కోసం ఏ త్యాగానికైన సిద్దపడటం, వారి కోసం జీవించడమే ప్రేమ అన్పించుకొంటుంది" అని సాధువు హితబోధ చేశాడు.                                       ◆నిశ్శబ్ద.  
కొన్ని దశాబ్దాల క్రితం పరిస్థితులతో పోల్చుకుంటే ఇప్పటి జీవనవిధానం మారింది. శారీరిక శ్రమ తగ్గిపోయింది, ఎక్కడికక్కడ పని సులువుగా జరిగిపోతోంది. కానీ అందుకు విరుద్ధంగా ఆహారపు అలవాట్లు మాత్రం దిగజారిపోయాయి. ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో తెలియని పరిస్థితి. అందుకనే ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. కొత్త కొత్త పదాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఒకటే ‘కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌’.   ఏమిటీ కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌!     మన ఆహారంలో పిండిపదార్థలు ఓ ముఖ్య పాత్రని వహిస్తాయని తెలిసిందే! అయితే ఈ పిండి పదార్థాలను ఎడాపెడా తీసుకోవడం వల్ల వాటిలోని అధిక చక్కెర మన శరీరాన్ని నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బేకరీ పదార్థాలు, శీతల పానీయాలు, స్వీట్లు, తియ్యటి తేనీరు, చాక్లెట్లు, ఐస్ క్రీములు... ఇలా చెప్పుకుంటో పోవాలే కానీ చక్కెర అధికంగా ఉండే పదార్థాల జాబితా చాంతాడుని మించిపోతుంది. కొంతమంది ఈ పదార్థాలను వదిలి లేకపోవడమే కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్.   ఏం జరుగుతుంది కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌ ఉన్నవారు చక్కెర అధికరంగా ఉండే పదార్థాలను తినేందుకు ఉబలాడపడిపోతుంటారు. ఒకటి రెండు రోజుల పాటు ఇలాంటి పదార్థాల దొరక్కపోతే వీరికి చాలా చిరాగ్గా ఉంటుంది. పిల్లలైతే ఆ పదార్థాన్ని తీసుకునేదాకా పేచీ పెడుతూనే ఉంటారు. వీరి శరీరం చక్కెరకు అలవాటు పడటం వల్ల, చక్కెర తీసుకున్న వెంటనే వారి ఒంట్లో ‘డోపమైన్‌’ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఈ డోపమైన్‌ మనసు సంతోషంగా ఉన్న ఒక భావనని కలిగిస్తుంది. మద్యం వంటి వ్యసనాలలో కూడా ఈ డోపమైన్‌దే ముఖ్య పాత్ర. తరచూ ఏదో ఒక చక్కెర పదార్థాన్ని తినాలని నాలుక లాగుతూ ఉంటడం, ఎదురుగుండా ఎంత తీపి పదార్థం ఉంటే... అంతా తినేయడం, ఊబకాయం వస్తున్నా కూడా ఆహారాన్ని నియంత్రించుకోకపోవడం... ఇవన్నీ కూడా కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్‌ లక్షణాలే!   ప్రమాదం కార్బొహైడ్రేట్ ఎడిక్షన్‌ అనేది ఆషామాషీగా తీసుకోవల్సిన లక్షణం కాదని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. చిన్నవయసులో ఊబకాయం బారిన పడేవారిలో 75 శాతం మందిలో ఈ లక్షణం కనిపిస్తోందట. కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్ ఉన్న వారిలో ఇన్సులిన్‌ చాలా అధికంగా ఉత్పత్తి అవుతుంది. అది కొన్నాళ్లకి అస్తవ్యస్తంగా మారిపోయి, చక్కెర వ్యాధికి దారితీస్తుంది. ఇక ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల వచ్చే గుండెజబ్బుల వంటి ఇతరత్రా సమస్యల గురించి చెప్పనే అక్కర్లేదు. పైగా చక్కెర అధికంగా ఉండే చాలా పదార్థాలలో విటమిన్లు, ఖనిజాలు తదితర పోషక పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరం ఆరోగ్యంగా కనిపిస్తుందే కానీ, కూర్చుంటే లేవలేనంత నిస్సత్తువ ఉంటుంది.   మరేం చేయడం! - ముందుగా తీపి పదార్థాలలోనే కాస్త ఆరోగ్యకరమైనవి ఎంచుకోండి. ఉదాహరణకు పండ్ల రసాలకు బదులుగా పండ్లు, ఐస్‌క్రీంకు బదులుగా పెరుగు... ఇలాగన్నమాట.   - ఇంట్లో అదేపనిగా చిరుతిళ్లను నిలువ చేసుకోవడం అపేయండి. మీ ఇంట్లో చిరుతిండి డబ్బాలను ఖాళీ చేయండి.   - ఆకలి వేయకపోయినా కూడా ఏదో ఒకటి తినాలని నోరు పీకేస్తుంటే బాదం పప్పులు, టమోటాలు, ఆమ్లెట్లు, మొలకలు... ఇలా తక్కువ పిండి పదార్థాలు ఉండే చిరుతిళ్లని తీసుకోండి.   - నీరు తాగడం వల్ల ఆకలి తాత్కాలికంగా ఉపశమిస్తుంది. కడుపు నిండిన భావనా కలుగుతుంది. ఒంట్లోని చెడంతా బయటకి పోవడమూ ఉంటుంది. కాబట్టి కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్‌ నుంచి బయటపడే వరకూ కాస్త మంచినీరుని ఆరారగా తీసుకుంటూ ఉండండి.   - వ్యాయామం వంటి శారీరిక శ్రమను అలవాటు చేసుకోండి. దీని వల్ల కొవ్వు కరగడమే కాదు, శరీరంలో ‘నిజమైన’ ఆకలి మొదలవుతుంది. అది తీపి పదార్థాల మీద కాకుండా పోషక పదార్థాలను తీసుకోవాలని కోరుకుంటుంది.   - మీ పిల్లల్లో కనుక కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్ ఉందని గమనిస్తే, వారిని కూర్చోపెట్టి అందులోని లాభనష్టాల గురించి వివరించండి. - నిర్జర.
ఉసిరికాయను అమలకి అని కూడా అంటారు. దీన్ని సాధారణంగా వంటలలో వాడుతుంటారు.  పచ్చళ్లు, పానీయాల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు.  అయితే ఉసిరికాయ ఆరోగ్యానికి చేకూర్చే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. రోజూ కనీసం ఒక ఉసిరికాయను తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరతాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.  అయితే ఉసిరికాయ రసంలో తేనె కలిపి తీసుకుంటే చాలా షాకింగ్ ఫలితాలు ఉంటాయి.  అవేంటంటే.. పోషకాలు.. ఉసిరికాయలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ వంటి గుణాలు ఉన్నాయి.  ఇందులో పైబర్ కంటెంట్ కూడా ఎక్కువే.. ఇది జీర్ణక్రియను మెరుగ్గా ఉంచి,  మలబద్దకాన్ని నివారిస్తుంది.   రోగనిరోధక శక్తి.. ఉసిరికాయ రసంలో తేనె కలిపి తీసుకుంటే యాంటీ బాడీస్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మధుమేహం.. ఉసిరిలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. దీన్ని తేనెతో కలిపి సేవించడం వల్ల మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. జీర్ణక్రియ.. ఉసిరిలో ఫైబర్ ఉంటుంది.  ఇది జీర్ణక్రియను నిర్వహించడంలో సహాయపడుతుంది. తేనెలో ఉండే గుణాలు కూడా జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. తేనె,  ఉసిరి రెండూ కలిపి తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. జుట్టు.. జుట్టు మందంగా,  ఆరోగ్యంగా, నల్లగా పెరగడంలో ఉసిరికాయ సహాయపడుతుంది.  ఉసిరికాయ రసాన్ని, తేనెను కలిపి తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగవుతుంది.  జుట్టు సంబంధ సమస్యలు తగ్గుతాయి. చర్మం.. ఉసిరిలో విటమిన్-సి, యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. ముఖం మీద మచ్చలు, మొటిమలు రాకుండా చేస్తాయి.                                            *రూపశ్రీ.
  ఆపిల్ సైడర్ వెనిగర్  ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతోంది.  దీన్ని ముఖ్యంగా బరువు తగ్గడానికి  ఉపయోగిస్తారు.  ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం మాత్రమే కాకుండా చర్మం,  జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుంది.  హార్మోన్లను బ్యాలెన్స్డ్ గా ఉంచడంలో కూడా ఇది సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటూ గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.   అయితే ఆపిల్ సైడర్ వెనిగర్ ను వాడేవారు దాన్ని సరైనా పద్ధతిలోనే వాడుతున్నారా లేదా అనేదాన్ని బట్టి పై ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని తప్పుగా వాడితే ప్రయోజనాలు చేకూరడానికి బదులు హాని కలుగుతుంది. అసలు ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఎలా వాడాలంటే.. ప్రయోజనాలు.. ఆపిల్ సైడర్ వెనిగర్  కొలెస్ట్రాల్ స్థాయిని  నియంత్రిస్తుంది. రోజూ 1 స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను గ్లాసుడు వేడి నీటిలో కలిపి తీసుకోవాలి.  ప్రయోజనకరంగా ఉంటుంది. ఆపిల్ సైడర్ వెనిగర్  గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో,  ఇన్ఫెక్షన్ ల నుండి రక్షించడంలో కూడా సహాయపడుతుంది.  ఆపిల్ సైడర్ వెనిగర్ రోజూ తీసుకుంటే  జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.  చర్మం మీద  మచ్చలు లేకుండా ప్రకాశవంతంగా ఉంచుతుంది. మధుమేహం ఉన్నవారికి కూడా ఆపిల్ సైడర్ వెనిగర్ ప్రయోజనకరంగా ఉంటుంది.  ఇది రక్తంలో  చక్కెర స్థాయిని  అదుపులో ఉంచుతుంది. జుట్టు పెరగడం, చుండ్రు,  దురద వంటి సమస్యలను తొలగించడానికి, 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని ఒక మగ్ నీటిలో కలపాలి. తలస్నానం చేసేటప్పుడు ఈ నీటిని మీ జుట్టుపై పోసి 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఎలా తాగాలి.. 3 నెలల పాటు ప్రతిరోజూ 1 నుండి 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ మొత్తం కంటే ఎక్కువ ఆపిల్ వెనిగర్  జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది.  దంతాలు కూడా పసుపు రంగులోకి మారుతాయి.                                                   *రూపశ్రీ.