డాక్టర్ శ్రీభూషణ్ రాజుకు ‘తెలుగువన్’ సత్కారం

 

తెలుగువన్ 15వ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ కిడ్నీ వైద్యులు డాక్టర్ శ్రీ భూషణ్ రాజును ఘనంగా సత్కరించారు. డా. శ్రీ భూషణ్ రాజు నిమ్స్‌లో ప్రముఖ కిడ్నీ వైద్యులు. ఆయన ఇప్పటి వరకూ దాదాపు 150కి పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేశారు. అందులో 145కు పైగా విజయం సాధించినవే. శ్రీ భూషణ్ రాజు గారు రోగులతో అంత ఆప్యాయంగా, ప్రేమగా ఉంటారు. మానసికంగా క్రుంగిపోయిన రోగులు సైతం ఆయన చేసే మోటివేషన్ వల్ల జీవితం మీద ఆశ పెంచుకుంటారు. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా రోగులందరిని సమానంగా చూసే మంచి మనసున్న వైద్యులు డా. భూషణ్ రాజు. తెలుగువన్ ఫౌండేషన్ ద్వారా వచ్చిన ఎంతో మంది షేషంట్లకు ఆయన సహాయం అందించారు. వైద్య వృత్తిలో నిర్విరామంగా కృషి చేస్తూ వేలాదిమంది జీవితాలలో సంతోషాన్ని నింపిన డా. శ్రీ భూషణ్ రాజు తన కెరీర్‌లో వ్యక్తిగత జీవితంలో మరిన్ని విజయాలను అందుకోవాలని ‘తెలుగువన్’ కోరుకుంటోంది. ఆయనను సత్కరించే సదవకాశం కలిగినందుకు సంతోషిస్తోంది.