చంద్రబాబు బాటలో సిద్ధరామయ్య

వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. హైకమాండ్ ఆదేశాలో..లేక తనకు తోచిందో కానీ కీలక నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతు రుణమాఫీని అమలు చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. దీని కింద మొత్తం రూ.8,167 కోట్ల రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. గతంలో కో-అపరేటివ్ బ్యాంకుల నుంచి తీసుకున్న దాదాపు రూ.50వేల లోపు రైతు రుణాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం ప్రకటనతో కర్ణాటక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.