Facebook Twitter
పాలు పెరుగు మజ్జిగ వెన్న

పాలను బాధ పెడితే పెరుగు వస్తుంది.
పెరుగును సతాయిస్తే వెన్న వస్తుంది.
వెన్నని కష్టపడి చిలికితే నెయ్యి వస్తుంది.

పాల కంటే పెరుగు విలువ ఎక్కువ,
పెరుగు కంటే వెన్న విలువ ఎక్కువ,
వెన్న కంటే నెయ్యి విలువ ఎక్కువ.

పాలు ఉపయోగ పడేవే,
కానీ ఒక రోజు కోసమే..
తరువాత అవి  పాడైపోతాయి.

పాలల్లో ఒక చుక్క మజ్జిగ వేస్తే
అది పెరుగు అవుతుంది.
కానీ రెండు రోజులే ఉంటుంది.

పెరుగును చిలకడంతో వెన్న వస్తుంది.
ఇది కూడా 3 రోజులు ఉంటుంది...

వెన్నని కాచినప్పుడు నెయ్యి వస్తుంది.
కాని నెయ్యి ఎప్పుడూ పాడవ్వదు...

ఒక్కరోజులో పాడయ్యే పాలలో
ఎప్పుడూ పాడవ్వని నెయ్యి దాగి ఉంది...
పాలు పెరుగు మజ్జిగ వెన్న
ఈ నాలిగింటి రంగు తెలుపే.

దీని అర్థం ఏమిటంటే,మాటిమాటికి దుఃఖం,
ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా
ఏ వ్యక్తి రంగు మారదో, సమాజంలో
ఆ వ్యక్తికే విలువ ఉంటుంది.

అదేవిధంగా మీ మనసు కూడా
లెక్కలేన్నని శక్తులతో నిండి ఉంది,
దానిలో మంచి ఆలోచనలని నింపి
మీకు మీరే చింతన చెయ్యండి.

ఏ సమస్య వచ్చినా ఇలానే విశ్లేషించి చూడండి
మీరు ఎప్పుడూ ఓడిపోరు ధైర్యశాలి అవుతారు...