రసగుల్లా  రెసిపి

 

 

 కావలసిన పదార్థాలు:

మైదాపిండి - 1/2kg

నిమ్మరసం -1/2 tbsp

నెయ్యి - 100grm

కేసరి రంగు - చిటెకెడు

పంచదార- 1/2kg

పాలు - 1 cup

యాలకుల పొడి -1/2 tsp

 

తయారు చేయు విధానం :

1. మైదా పిండిని నూనె కొద్దిగా నిమ్మరసం కలిపి మెత్తగా ముద్ద చేసుకోవాలి.

2. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టి, అందులో డాల్డా లేదా నెయ్యి వేసి వేడిచేయాలి. మైదా మిశ్రమాన్ని చిన్న సైజులో మందపాటి పూరీల్లా వత్తుకుని వేడయిన నూనెలో బ్రౌన్‌ రంగు వచ్చేవరకు వేయించాలి.

3. ఇంకోవైపున పంచదారలో తగినంత నీటిని పోసి అందులో యాలకుల పొడి, రంగు వేసి పాకం తయారు చేసుకోవాలి.

4. ఇప్పుడు నూనెలో వేయించిన పూరీలను పాకంలో ముంచి తీసి ఆరబెట్టి ఆ తరువాత వడ్డించుకోవాలి. అంతే స్వీట్ రసగుల్లా రెడీ.