ఖర్జూరం స్వీట్ రెసిపి

 

 

కావలసిన వస్తువులు:

ఖర్జూరం - 500 గ్రాములు.

చక్కెర - 2టేబుల్ స్పూన్.

నెయ్యి - 1టేబుల్ స్పూన్.

పిస్తా - 400 గ్రాములు.

 

తయారు చేసే విధానం:

ముందుగా ఖర్జూరంలో గింజలు శుభ్రంగా తీసేయాలి.

ఇప్పుడుప్యాన్ పెట్టి ఒక స్పూన్ నేతిలో వేయించి ప్యాన్ లో నుంచి తీసి, చపాతి లాగ చేసుకోవాలి.

పొట్టు తీసిన పిస్తా గింజల్ని నూనెలేకుండా వేయించాలి.

చపాతీల్లా చేసిన ఖర్జూరం పైన పిస్తా గింజలు అన్నివేసేసి బయటకి రాకుండా గట్టిగా వత్తాలి.

అన్ని అలాగ చేసాక, దోశ లాగ చుట్టేయాలి.

తరువాత దాన్ని కట్ చేసుకోవాలి