భూసేకరణ పై జగన్ ధర్నా

 

రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల దగ్గర నుండి భూములు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రాజధాని పరిధిలోని ఐదు గ్రామల రైతులకు నోటిఫికేషన్లు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  భూసేకరణ వ్యవహారంపై విజయవాడలో సీఆర్ డీఏ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులకు మద్దతునిస్తూ.. ఆపార్టీ నేతలు వారితో పాటు భూసేకరణ కింద ఇప్పటికే భూములు కోల్పోయిన.. భూ సేకరణ పేరుతో భూములు కోల్పోనున్న రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu