యువతిని చంపాలనుకున్నాడు.. కానీ...

 

కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో శుక్రవారం తెల్లవారుఝామున ఒక సంచలన ఘటన జరిగింది. ఒక యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడిని ఆ యువతి బంధువులు కొట్టి చంపారు. కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌కి చెందిన ఒక యువతిని రాజు అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. ఆ యువకుడికి ఎన్నిసార్లు చెప్పినా తన ఉన్మాదం వదల్లేదు. శుక్రవారం తెల్లవారుఝామున రాజు కొడవలితో తమ ఇంటికి వచ్చి తమ కుమార్తెను చంపడానికి ప్రయత్నించాడని, తామంతా కలిసి రాజును చంపేశామని ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపి లొంగిపోయారు. ఈ ఘటనలో యువతి తల్లిదండ్రులతోపాటు ఆ యువతి కూడా స్వల్పంగా గాయపడింది. నిజానికి అక్కడ జరిగిన ఘటన యువతి తల్లిదండ్రులు చెప్పినట్టే జరిగిందా... ఇందులో మరోకోణం ఏమైనా వుందా అనే అనుమానాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu