విశాఖ వన్డేలో టీమిండియా ఘన విజయం

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా విశాఖలో శ్రీలంకతో జరిగిన వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 44.5 ఓవర్లలోనే అలౌటై ..భారత్ ముందు 215 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన భారత్ ఆడుతూ పాడుతూ టార్గెట్ రీచ్ అయ్యింది. ఓపనర్ శిఖర్ ధావన్ 100, శ్రేయస్ అయ్యర్ 65 పరుగులతో లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో కేవలం 32.1 ఓవర్లకే ఆట ముగిసింది. ఈ విజయంతో టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుని తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. కెప్టెన్‌గా రోహిత్ ఖాతాలో తొలి సిరీస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu