వెంకయ్య రాజీనామాతో మారిన కేంద్ర కేబినెట్

ఎన్డీఏ పక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడంతో వెంకయ్య నాయుడు తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. వెంటనే దానిని ఆమోదిస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వెంకయ్య రాజీనామాతో కేంద్ర మంత్రివర్గంలో ఖాళీ ఏర్పడినట్లైంది. దీంతో తన కేబినెట్‌లో స్వల్ప మార్పులు చేయాలని ప్రధాని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు వెంకయ్య నాయుడు అధీనంలో ఉన్న పట్టణాభివృద్ధి శాఖను నరేంద్రసింగ్ తోమర్‌కు..అలాగే సమాచార, ప్రసార శాఖల బాధ్యతలను స్మృతీ ఇరానీకి అప్పగించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu