వైసీపీకి షాక్... టీడీపీలోకి వంగవీటి రాధా...!

 

విజయవాడ రాజకీయాల్లో పెను సంచలనం రేగుతోంది. వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలోకి జంప్ అవ్వనున్నట్టు రాజకీయ వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది. గత కొద్దికాలంగా వైసీపీ పార్టీతో, జగన్ తో వంగవీటి రాధాకు విబేధాలు నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీ పై కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపిస్తూనే ఉన్నారు. ఇక దీనిలో భాగంగానే ఆయన టీడీపీలోకి వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఆయనతో మాట్లాడినట్టు వార్తలు బయటకు రావడంతో చర్చలు జరుగుతున్నాయి. అయితే రాధా అధికారికంగా ఎలాంటి విషయమూ చెప్పలేదు కానీ...ఆయన అనుచరులు మాత్రం.. పార్టీ మార్పు ఖాయమంటున్నారు. అంతేకాదు.. తనకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఖాయం చేసిన పక్షంలో పార్టీ మారేందుకు రాధ సిద్ధంగా ఉన్నారని, ఈ విషయమై తమతో చర్చించారని  ప్రధాన అనుచరులు చెబుతున్నారు. మరి వంగవీటి రాధ కూడా టీడీపీలో చేరితే వైకాపాకు పెద్ద దెబ్బే...