పంతం నెగ్గించుకున్నమాయా యూపీ తీర్మానం

లక్నో :  ఉత్తరప్రదేశ్ను నాలుగు రాష్ట్రాలుగా విజభించాలంటూ   రాష్ట్ర విభజన అంశంపై ముఖ్యమంత్రి మాయావతి సర్కార్ ప్రవేశపెట్టిన తీర్మానం అసెంబ్లీ  ఆమోదం పొందింది. మూజువాణితో ఓటుతో ఆమోదం పొందటంతో అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కాగా రాష్ట్ర విభజనను ఎస్పీ, బీజేపీలు వ్యతిరేకించాయి.కాగా ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే రాష్ట్ర విభజన అంశంపై సభలో దుమారం రేగింది. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో సభ మధ్యాహ్నం 12.30 గంటలకు వాయిదా పడింది. వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే అధికార బీఎస్పీ రాష్ట్ర విభజన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. విపక్ష సభ్యుల వ్యతిరేకత మధ్యే తీర్మానం ఆమోదం పొందింది. తీర్మానం ఆమోదంతో మాయావతి ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు.

అయితే యూపీ విభజనపై అసెంబ్లీ తీర్మానం అనతరం మీడియాతో మాట్లాడుతూ తీర్మానాన్ని  కేంద్రానికి పంపనున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి తెలిపారు. అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడిన అనంతరం ఆమెమీడియా  సమావేశంలో మాట్లాడుతూ యూపీ విభజన రాజకీయ ఎత్తుగడ కాదని, ఎన్నికల నేపథ్యంలోనే తాము విభజనకు ప్రయత్నించటం లేదని 2007 నుంచి రాష్ట్ర విభజనకు ప్రయత్నిస్తున్నామన్నారు.అయితే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్లే మళ్లీ తీర్మానం చేయాల్సి వచ్చిందన్నారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధిని విపక్షాలు కోరుకోవటం లేదని మాయ మండిపడ్డారు. విభజనను వ్యతిరేకిస్తున్న పార్టీలన్ని దళిత వ్యతిరేకులేనని ఆమె అన్నారు. రానున్న ఎన్నికల్లో విపక్షాలకు ప్రజలే తగిన బుద్ది చెబుతారన్నారు.ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణ విభజనపై పోరాటం జరుగుతోందని మాయా తన ప్రసంగంలో ప్రస్తావించారు. తెలంగాణపై కూడా కాంగ్రెస్ తీర్మానం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎంపీలు చేసిన రాజీనామాలను ఇప్పటికీ ఆమోదించలేదన్నారు. ఎంపీల అభీష్టాన్ని అధిష్టానం పరిగణనలోకి తీసుకోవాలని మాయా పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu