సాయం చేస్తామని చెప్పి..సామూహిక అత్యాచారం చేశారు
posted on Jul 12, 2017 11:15AM

కర్ణాటకలో ఘోరం జరిగింది..సాయం చేస్తామని చెప్పి ఒక బాలికపై సామూహిక అత్యాచారానికి దిగారు కామాంధులు. ఉడుపి జిల్లా మణిపాల్కు చెందిన ఓ బాలిక, ఉడుపికి చెందిన కుర్రాడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆ యువకుడు హావేరి జిల్లా రాణిబెన్నూర్కు వచ్చేశాడు. ప్రియుడి ఎడబాటును తట్టుకోలేని ఆ బాలిక కూడా ఈ నెల 5వ తేదీన మణిపాల్ నుంచి కేఎస్ఆర్టీసీ బస్సులో ఒంటరిగా రాణిబెన్నూరుకు వచ్చింది..ప్రియుని కోసం వీధి వీధి గాలించి కనిపించకపోవడంతో తిరిగి సొంతూరు వెళ్లడానికి 6వ తేదీ రాత్రి రాణిబెన్నూరు బస్టాండ్కు చేరుకుంది. బాలిక పరిస్థితిని ఓ కంట గమనిస్తున్న కేఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్ వీరయ్య, కండక్టర్ యువరాజ్, మరో డ్రైవర్ రాఘవేంద్రలు తాము సహాయం చేస్తామని నమ్మించి బస్సులోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు..అనంతరం బాలికను తర్వాతి రోజు ప్రయాణికులతో మణిపాల్లో దించేశారు..ఇంటికి చేరుకున్న తర్వాత జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు..రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
