కెటీఆర్ తో తీన్మార్ మల్లన్న భేటీ
posted on Mar 17, 2025 4:49PM
బిఆర్ ఎస్ కార్యనిర్వాహణాధ్యక్షుడు కెటీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న( చింతపండు నవీన్ కుమార్ ) అసెంబ్లీలో భేటీ అయ్యారు. తీన్మార్ మల్లన్న బిఆర్ఎస్ నేతను కలవడం చర్చనీయాంశమైంది. బిసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని మల్లన్న బిఆర్ఎస్ నేతలైన కెటీఆర్ , హరీష్ రావులను కోరారు. మల్లన్న వెంట బిసీ నేతలు కూడా ఉన్నారు. తాము చేపట్టబోయే ధర్నాకు సంఘీభావం తెలపాలని బిఆర్ఎస్ నేతలను మల్లన్న కోరారు. పార్టీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ఆరోపణలపై ఈ నెల ఒకటో తేదీన తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. . గత నెలలో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారి చేసి వివరణ ఇవ్వాలని పేర్కొన్నప్పటికీ మల్లన్న సమాధానం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బిఆర్ఎస్ అవినీతి అక్రమాలను ప్రశ్నించి కాంగ్రెస్ కు ఆయన దగ్గరయ్యారు. అనూహ్యంగా ఎంఎల్ సి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై మల్లన్న ఆరోపణలు చేయడం గమనార్హం.