జాతీయపార్టీగా టీడీపీ తొలి గెలుపు

 

తెలుగుదేశం పార్టీ జాతీయపార్టీగా ఆవిర్భవించిన నేపథ్యంలో జాతీయపార్టీగా టీడీపీకి తొలి విజయం సాధించినట్టు తెలుస్తోంది. అండమాన్ నికోబార్ లోని పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తన సత్తా చాటుతోంది. ఈ రోజు ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకూ 12 వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. ఈ 12 వార్డుల్లో తెలుగుదేశంపార్టీ 5,6 వార్డుల్లో విజయం సాధించింది. మిగిలిన వార్డుల్లో బీజేపీ 6, కాంగ్రెస్ 1, ఏఐఏడీఎంకే 1, డీఎంకే 1, ఇతరులు 1 స్థానాన్ని గెలిచాయి.  ఇంకా 12 వార్డుల్లో ఫలితాలు రావాల్సి ఉంది. అయితే టీడీపీ జీజేపీ మిత్రపక్షాలే కాబట్టి ఈ రెండు పార్టీల కూటమికి మెజారిటీ దక్కాలంటే ఇంకా 5 స్థానాల్లో గెలుపొందాల్సిన అవసరం ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu