సినీనటుడు సంజయ్ కేసు తీర్పు నేడే

1993 మార్చి 12న ముంబైలో జరిగిన వరుస బాంబుపేలుళ్ళ కేసులో సినీనటుడు సంజయ్ దత్ కు టాడా కోర్టు 2006లో ఆరేళ్ళ కారాగారం శిక్షను విధించింది. కేసు విచారణ సందర్భంగా పదినెనిమిది నెలలు సంజయ్ దత్ జైల్లోనే గడిపారు. ఈ కేసు నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. సుప్రీంకోర్టు కనుక సంజయ్ దత్ నేరస్తుడని తేలితే మిగిలిన నాలుగున్నరేళ్లు జైల్లోనే గడపవలసి వస్తుంది. సుప్రీంకోర్టు తీర్పుతో తేలనున్న సంజయ్ భవితవ్యం ఏమిటోనని అతని అభిమానులు, సినీప్రముఖులు, ఆతృతగా ఎదురుచూస్తున్నారు.