మే 5న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు

 

బుధవారం ఢిల్లీలో జరిగిన విలేఖరుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమీషనర్ వి.ఎస్. సంపత్  మాట్లాడుతూ కర్ణాటక శాసనసభకు మే 5న ఒకే దశలో ఎన్నికలు జరపాలని, కర్ణాటకలోని 224 శాసన స్థానాలకు జరిగే ఎన్నికలకు బుధవారం నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని ఎన్నికల్లో ధనం, కండబలాన్ని నిరోధించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని, వార్తా కథనాల రూపంలో వచ్చే పరోక్ష ప్రకటనల పైనా నిఘా ఉంటుందని, ఆస్తులు, అర్హతలు, నెర చరిత్రకు సంబంధించి ఒకే అఫిడవిట్ ను రూపొందించినట్లు, పోలీసు అధికారులను సొంత జిల్లాల్లో ఉండనీయబోమని, ఒకేచోట మూడేళ్ళుగా పనిచేస్తున్న పోలీసు అధికారులను కూడా బదిలీ చేస్తామని, తగినన్ని బలగాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 17, నామినేషన్ల పరిశీలన  ఏప్రిల్ 18న, నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 20 ఆఖరు తేదీ అని ప్రకటించారు. ఎన్నికలు మే 5న నిర్వహిస్తారు. ఏప్రిల్ 8న ఓట్ల లెక్కింపు జరుగుతుందని కూడా తెలిపారు.