కేంద్రానికి సుప్రీం ప్రశ్న... మీ వైఖరేంటీ



తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు జరుగుతున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కేంద్రాన్ని కృష్ణా జలాల వివాదంపై మీ వైఖరి చెప్పాలని సూటిగా ప్రశ్నించింది. గతంలో రాష్ట్ర ఒకటిగా ఉన్నప్పుడు బ్రిజేష్‌కుమార్‌ తుది, మధ్యంతర తీర్పు అమలు నిలిపివేయాలని పిటిషన్ వేశారు దీనిపై సుప్రీంకోర్టులో ఈ రోజు వాదనలు జరుగగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున వైద్యనాథన్‌ హాజరై వాదనలు వినిపించారు. అయితే వాదనలు విన్న సుప్రీంకోర్టు కృష్ణా జలాల వివాదంపై కేంద్రం వైఖరి చెప్పాలని అదేసమయంలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటి వాటాలోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu