అవిశ్వాసంపై చర్చకు అనుమతిస్తానన్న స్పీకర్.!!

 

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి.. సభ ప్రారంభంకాగానే వివిధ పక్షాలకు చెందిన సభ్యులు సభలో నిరసనకు దిగారు.. అవిశ్వాస తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ సభలో నినాదాలు చేశారు.. ఏపీకి న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేశారు.. విభజన హామీలను నెరవేర్చాలని కోరారు.. అయితే అవిశ్వాస తీర్మానంపై చర్చ గురించి స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ స్పందించారు.. అవిశ్వాసంపై టీడీపీ ఎంపీలు ఇచ్చిన నోటీసు అందిందన్న స్పీకర్.. అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతిస్తానన్నారు.. పదిరోజుల్లోపు అవిశ్వాసంపై చర్చిద్దామన్నారు.