సుష్మ పై శోభా డి వివాదాస్పద ట్వీట్... నెటిజన్ల ఆగ్రహం..

 

ప్రముఖ రచయిత్రి శోభా డి అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు మరోసారి వివాదాస్పదమైన ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు. అది కూడా ఏకంగా కేంద్రమంత్రి సుష్మ స్వరాజ్ పై. నూతన సంవత్సరంగా సందర్బంగా... ట్వీట్స్ ఆపేసి..ప్రశాంతంగా ఉండాలనే  నిర్ణయం తీసుకోవాలంటూ సలహా ఇచ్చారు. అంతే ఇంకేముంది ఆమెపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.  ‘ఈ నిర్ణయం మీకే వర్తిస్తుంది, చౌకగా ప్రచారం చేయడం మానుకోండి.. ఎందుకు మంత్రిని చూసి కుళ్లు కుంటున్నార’ని నెటిజన్లు ఆగ్రహించారు. మరికొందరు..‘విదేశాంగశాఖ మంత్రిగా ఆమె తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆమె అంటే అందరికీ ఎంతో గౌరవం’ అని కొందరు మంత్రి సుష్మాకు మద్దతుగా ట్వీట్లు చేశారు.

 

కాగా ఇటీవల రియో ​​ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు, పతకాలపై వ్యాఖ్యానించి శోభా డి విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ట్విట్టర్ జనాల ఆగ్రహానికి గురయ్యారు.