కాంగ్రెస్ పార్టీలో చేరిన సిద్దూ....
posted on Jan 15, 2017 12:22PM
బీజేపీ పార్టీ నుండి బయటకు వచ్చిన మాజీ ఎంపీ నవజ్యోత్ సింగ్ సిద్దూ ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. గత కొద్దికాలంగా అందరూ ఊహిస్తున్నట్లే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. రాహుల్ గాంధీ సిద్దూకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సిద్దూ చేరికతో పంజాబ్లో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. వాస్తవానికి జనవరి 9నే సిద్దూ కాంగ్రెస్లో చేరాల్సిఉంది. అయితే రాహుల్ గాంధీ విదేశాల నుంచి రావడం ఆలస్యంకావడంతో చేరిక వాయిదా పడింది. సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ గత నవంబర్లోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.