జానూ స్టెప్పులకు శేఖర్ మాష్టర్ ఫిదా... నీ కోసం క్యూ కడతారు

 

ఢీ సెలబ్రిటీ షో 2 ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఈ వీక్ లేడీస్ టీం లీడర్ శ్రీ సత్య ఆధ్వర్యంలో అమ్మాయిలంతా అద్దిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేశారు. మాస్ థీమ్ కాన్సెప్ట్ లో అందరూ డాన్సస్ ఇరగదీసారు. ఇక ఫస్ట్ పెర్ఫార్మెన్స్ గా జానులూరి వచ్చి "మాయదారి మల్లేశా" అనే తెలంగాణా జానపద పాటను చేసిన డాన్స్ మాములుగా లేదు. నెక్స్ట్ లెవెల్ లో చేసింది. స్టేజి మొత్తం కూడా ఆమె డాన్స్ కి ఊగిపోయింది. ఈ పాటకు శేఖర్ మాష్టర్ ఊగిపోయాడు. గణేష్ మాష్టర్ కూడా ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు. ఈ సాంగ్ ఐపోయాక శేఖర్ మాష్టర్ స్టేజి మీదకు వచ్చి జానూ ముందు మోకాళ్ళ మీద కూర్చుని విషెస్ చెప్పాడు. "ఈ సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంజాయ్ చేశారు. నాకు తెలిసి రెండు మూడేళ్ళ తర్వాత మళ్ళీ ఈరోజు ఈ డాన్స్ ని అంత బాగా ఎంజాయ్ చేశా..

 

ఇంత టాలెంట్ ఉందా" అని ఫిదా ఐపోయాడు. ఇక జాను మాట్లాడుతూ "ఇంతమంది జడ్జెస్, డాన్సర్స్ ఉంటారు. అసలే ఫోక్ డాన్సర్ ని చేయగలనా లేదా అనుకున్నా" అనేసరికి "టాలెంట్ ని ఎవరూ ఆపలేరు. రేపు మూవీస్ లో డాన్స్ చేయడానికి నీ కోసం క్యూ కడతారు చూడు" అని చెప్పాడు. ఇక జాను ఐదవ తరగతి చదువుతున్న తన కొడుకు లిరిని స్టేజి మీదకు తీసుకొచ్చేసరికి అందరూ షాకైపోయారు. ఇక ఆది ఐతే జాను ఎందుకు నీ పిల్లాడితో ఆడుకోక మాతో ఆడుకుంటున్నావ్ అంటూ డైలాగ్ వేసాడు. ఇలా ఈ షోలో జాను ఫుల్ మార్క్స్ తెచ్చుకుంది. ఫైనల్ లో కనకవ్వను స్టేజి మీదకు పిలిచి "నసబెల్లె" జానపదానికి అందరూ కలిసి స్టెప్పేశారు.