మెదక్ రైలు ప్రమాదం: ఏడుగురు ఇంటికి

మెదక్ జిల్లా బస్సు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులలో 12 మంది ఆరోగ్యం కుదుటపడిన విషయం తెలిసిందే. వారికి ఇక ఏ ప్రమాదమూ లేదని వైద్యులు చెప్పారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..గాయపడిన విద్యార్థులలో ఏడుగురిని యశోదా ఆసుపత్రి వైద్యులు ఈ రోజు డిశ్చార్జ్ చేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు మాట్లాడుతూ... కోలుకుంటున్న మరో ఏడుగురు విద్యార్థులను రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. మొత్తం 20 మంది విద్యార్థులు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతు౦డగా వారిలో ఇంకా ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు.