కోవిడ్ 19 టెస్టులు ఉచితంగా చేయాలని సుప్రీమ్ కోర్ట్ ఆదేశం

కోవిడ్ 19 టెస్ట్ లు ప్రభుత్వం గుర్తించిన ప్రైవేట్ లేదా ప్రభుత్వ లాబొరేటరీలలో ఉచితంగా చేయాలని సుప్రీమ్ కోర్ట్ ఆదేశించింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్. రవీంద్ర భట్ లతో కూడిన సుప్రీమ్ కోర్ట్ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. శశాంక్ దేవ్ శుద్ధి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన సుప్రీమ్ ధర్మాసనం, కోవిడ్ 19 టెస్ట్ లు ప్రైవేట్ లేదా ప్రభుత్వ లాబొరేటరీలలో ఉచితంగా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ ఏ బీ ఎల్ అక్రెడిటేడ్ ల్యాబ్స్ లో కానీ, డబ్ల్యు హెచ్ ఓ లేదా ఐ సి ఎం ఆర్ ఆమోదించిన ల్యాబ్స్ లో కానీ కోవిడ్ 19 టెస్టులు చేయాలనీ సుప్రీమ్ ధర్మాసనం ఆదేశించింది.