పవన్ కళ్యాణ్ ఎవరికేం చేసాడు..జగన్ పేదవాడు

సమీర్(sameer)తెలుగు సినిమా రంగంతో ఆయనకున్న అనుబంధం మూడు దశాబ్దాలపైనే. నేటికీ  ఎన్నో సినిమాల్లో లెక్కకు మించిన  పాత్రలు పోషిస్తు  తన సత్తా చాటుతు వస్తున్నాడు. దాదాపుగా తెలుగులో ఉన్న అందరి అగ్ర హీరోలతోను సినిమాలు చేసాడు. ఇంద్ర ,స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, ఠాగూర్, కిక్ 2 , సాక్ష్యం, లెజండ్, పాండురంగడు, శ్రీరామదాసు, ధమాకా ,వీర సింహారెడ్డి ,అత్తారింటికి దారేది ఇలా సుమారు డెబ్భై చిత్రాల దాకా చేసాడు. లేటెస్ట్ గా ఆయన జగన్ మీద  చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

సమీర్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో వైసీపి అధినేత జగన్ (jagan)మీద  ఒక రేంజ్ లో రెచ్చిపోయాడు. రాబోయే రోజుల్లో  వైసీపీ పార్టీ అనేది ఒకటుందనే విషయాన్ని ఏపి ప్రజలు మర్చిపోతారు. ఒక వేళ గుర్తు ఉన్నా కూడా వాళ్ళు చేసిన అరాచకాల వల్ల గుర్తుంటుంది.  ఇది వరకు రోజుల్లో పాపం చేస్తే శిక్ష పడటానికి లేట్ అవుతుంది. ఇప్పుడు అలా కాదు  మర్నాడే శిక్ష పడుతుంది. మొన్న ఎన్నికల్లో  కూటమి  గెలిచింది  అనే కంటే వైసీపీ గెలిపించిందని చెప్పవచ్చు. జగన్ కూడా తన ఓటుని చంద్రబాబు నాయుడు గారికే  వేసి ఉంటారు. అలాగే జగన్ సభలకి ప్రజలు  భారీగా ఎందుకెళ్లారంటే చివరి చూపుగా వెళ్లారు.

జగన్ ఎన్నో అరాచకాలు చేసాడు.వాటిని తలుచుకుంటే కళ్ళ వెంట కన్నీళ్లు వస్తాయి. వైజాగ్ లోని రుషి కొండ ని తొలగించి ప్యాలస్ ని కట్టాడు. కట్టేటప్పుడు ఎవరికైనా తెలుస్తుందేమో అని  ఒరిస్సా వాళ్ళని తీసుకొచ్చి  కట్టాడు. అలాగే పధకాల పేరుతో డబ్బులు ఇచ్చి మందుతో లాక్కొన్నాడు. అలాగే ఎవరితో అయితే పెట్టుకోకూడదో ఆయనతోనే పెట్టుకున్నాడు. తిరుపతి ఏడుకొండల వాడి పేరు చెప్పుకొని డబ్బులు  సంపాదించాడు.  గదుల రేట్లు విపరీతంగా పెంచాడు. అలాగే జగన్ చాలా పేద వాడు. అందుకే  ముప్పై ఐదు లక్షలు ఖర్చుపెట్టి బాత్ రూమ్ లోని టాయిలెట్ కమోర్డ్  చేయించుకున్నాడని 
తన దైన స్టైల్లో సెటైర్ కూడా వేసాడు. ఈ సందర్భంగా పవన్ (pawan)గొప్పతనాన్ని కూడా చెప్పాడు.  ఒక రోజు పేపర్ లో పేద అమ్మాయికి చదువుకోవడానికి డబ్బులు లేవని ప్రకటన వచ్చింది. అది చూసిన పవన్ వెంటనే తన మేనేజర్ ని పిలిచి విషయం కనుక్కోమన్నాడు. అదంతా తన  కళ్ళ ముందే జరిగిందని చెప్పుకొచ్చాడు.  కూటమిని గెలిపించి మంచి పని చేసారు అని కూడా చెప్పాడు.